అర్వపల్లి/తిరుమలగిరి/చివ్వెంల/నాగారం/నూతనకల్/నడిగూడెం/చిలుకూరు/పాలకీడు/మఠంపల్లి, డిసెంబర్ 10 : రైతులు వరికి బదులు ఆయిల్పామ్ సాగు వైపు దృష్టి సారించాలని డీఏఓ రామారావు నాయక్ సూచించారు. మండలంలోని జాజిరెడ్డిగూడెంలో శుక్రవారం రైతులకు ఆరుతడి పంటల సాగుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ఆయిల్పామ్ సాగుకు ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో ఏఓ రేఖల దినాకర్, ఏఈఓలు శోభారాణి, నేరెళ్ల సత్యం పాల్గొన్నారు.
నూతన సాంకేతికతతో అధిక దిగుబడులు
వ్యవసాయంలో నూతన సాంకేతిక పద్ధతులు అవలంబించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్త భరత్ అన్నారు. చివ్వెంల మండలం ఐలాపురం, తిరుమలగిరి మండలం తాటిపాముల, నాగారం మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ, కంపాసాగర్ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. కొత్త యాజమాన్య పద్ధతుల్లో సాగులో లాభదాయక విషయాల గురించి కూలంకంషంగా వివరించారు. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమాల్లో ఏఓలు ఆశాకుమారి, వెంకటేశ్వర్లు, సర్పంచులు బోడపట్ల సునీతాశ్రీను, ఎర్రశోభ, ఏఈఓలు వెంకట్రెడ్డి, శ్రీను పాల్గొన్నారు. నడిగూడెం మండలం రామాపురం గ్రామం, నూతనకల్ మండలం ఎర్రపహాడ్, చిలుకూరు మండలం రామాపురం, కొమ్ముబండతండా, దూదియాతండా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఏఓలు రాజగోపాల్, శ్రీనివాస్, దీపిక, ఏఈఓ జానయ్య, మఠంపల్లి మండలం యాతవాకిళ్ల సర్పంచ్ కోలాహలం లక్ష్మీనరసింహరాజు పాల్గొని ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. పంటమార్పిడితో భూసారం పెరుగుతుందని తెలిపారు.