బంజారాహిల్స్ : రోడ్డుమీద వెళ్తున్న కారు ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో కారులో ప్రయాణిస్తున్న వారు అప్రమత్తమై కారులో నుంచి దిగడంతో ముప్పు తప్పింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఉప్పల్కు చెందిన ఏటిపాముల లిఖిత్ తన స్నేహితుడు శ్రీధర్తో కలిసి బుధవారం ఉదయం ఉప్పల్ నుంచి గచ్చిబౌలికి తమ శాంత్రో కారు (ఏపీ 09బీసీ 7816)లో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ మీదుగా వెళ్తున్నారు. సరిగా చెక్పోస్ట్ సమీపంలోకి రాగానే కారు ఇంజిన్లోంచి మంటలు రావడంతో ఆందోళనకు గురయిన లిఖిత్ కారును రోడ్డుపక్కన ఆపేసి కారులోంచి బయటకు పరుగులు తీశారు.
సమీపంలో విధులు నిర్వహిస్తున్న ఇంటర్సెప్టార్ పోలీసులు అక్కడకు చేరుకుని రోడ్డుమీద వెళ్తున్న వాటర్ ట్యాంకర్ను ఆపి ఆ నీటితో మంటలు ఆర్పారు.