మక్తల్ టౌన్, జనవరి 9: అన్నదాతల్లో సీఎం కేసీఆర్ ఆనందం నింపుతున్నారని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. ఆదివారం మక్తల్ మున్సిపాలిటీలోని ఆరోవార్డు తిరుమలాపూర్ గ్రామంలో రైతుబంధు సంబురాలను నిర్వహించారు. వేరుశనగ పండించిన రైతు పొలంలో వేరుశనగ పంటను పరిశీలించి సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడుతూ మండలంలో వరికి బదులుగా వేరుశనగ పండించి రైతులు ఆనందంగా సంబురాల్లో పాల్గొంటున్నారని తెలిపారు.సీఎం కేసీఆర్ రైతులకు పెట్టుబడి సాయంగా అందజేస్తున్న రైతుబంధు సరైన విధంగా వినియోగించుకోవాలని తెలిపారు. ప్రతి రైతుకుటుంబానికి ఇస్తున్న రైతుబంధు ప్రతి రైతుకు ఊరట నిస్తుందని తెలిపారు. అదేవిధంగా వేరుశనగను పండించిన రైతు క్రిష్ణయాదవ్ను అభినందించారు. అదేవిధంగా అధికారులు, నాయకులు, ప్రత్యామ్నాయ పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. అదేవిధంగా అధికారులు రైతుల పొలంలో భూసార పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్గౌడ్, మండల అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, మాగనూర్ జెడ్పీటీసీ వెంకటయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి.నర్సింహగౌడ్, టౌన్ ప్రెసిండెంట్ అమర్, రామలింగం, తాయప్ప, జుట్ట శంకర్, గవినోళ్ల నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
మంథన్గోడ్లో..
మక్తల్రూరల్, జనవరి 9: వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకంతో రైతుబాంధవుడిగా మారారని పేట జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అన్నారు. ఆదివారం మక్తల్ మండలంలోని మంథన్గోడ్ గ్రామంలో రైతుబంధు సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుబంధు పథకంలో భాగంగా ఇప్పటివరకు 50 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమచేసిందన్నారు. గ్రామాల్లో రైతులు సమావేశాలు నిర్వహించుకొని పంటల విధానంపై చర్చించుకోవడానికి రైతు వేదికలను నిర్మించిందన్నారు. పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల రూపురేఖలు మారిపోయాయన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు ఆంజనేయులుగౌడ్, సర్పంచ్ మహాదేవమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు సుమిత్ర, ఉప సర్పంచ్ కృష్ణయ్యగౌడ్, ఏఈవో వేదవతి, రైతులు పాల్గొన్నారు.
ట్రాక్టర్ నడిపిన ఎమ్మెల్యే చిట్టెం
ఊట్కూర్, జనవరి 9: రైతు సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. ఆదివారం మాగనూర్ మండలంలోని వర్కూర్ రైతు వేదిక వద్ద టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుబంధు సంబురాలు నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. రైతులు, టీఆర్ఎస్ నేతలు పెద్దసంఖ్యలో పాల్గొని ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే చిట్టెం ట్రాక్టర్ నడుపుతూ ప్రజలను ఉత్సా హపరిచారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడకూడా రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు కావడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలు దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. రైతాంగానికి 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధికి అడ్డు తగిలితే సహించబోమని ప్రతిపక్ష పార్టీలను హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, మక్తల్ మార్కెట్ చైర్మన్ రాజేశ్గౌడ్, జెడ్పీటీసీ వెంకటయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ నర్సింహగౌడ్, సర్పంచ్ నిర్మలమ్మ, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, మాగనూర్, టీఆర్ఎస్ మక్తల్ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి, మహిపాల్రెడ్డి, వైస్ ఎంపీపీ తిప్పయ్య, ఉప సర్పంచ్ కృష్ణయ్య, టీఆర్ఎస్ నాయకులు నేతాజీరెడ్డి, ఈశ్వర్యాదవ్, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
ఊట్కూర్లో..
మండలంలోని పగిడిమర్రి గ్రామంలో ఆదివారం రైతుబంధు సంబురాలు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ సులోచనమ్మ ఆధ్వర్యంలో మహిళలు, విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు వ్యవసాయశాఖ అధికారుల సూచనలు, సలహాలను పాటిస్తూ పంట దిగుబడులు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈవో సాగర్ ,ఎంపీటీసీ షహనాజ్బేగం, ఉప సర్పంచ్ మహబూబ్అలీ, నాయకులు భాస్కర్రెడ్డి, విష్ణుమూర్తిగౌడ్, మొగులప్ప, హన్మిరెడ్డి, అరవింద్రెడ్డి పాల్గొన్నారు.
గుండుమాల్లో..
కోస్గి, జనవరి 9: రైతుబంధు రావడంతో రైతన్న పొలంపనుల్లో నిమగ్నమయ్యాడు. గత 13 రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ఖాతాల్లో ఎకరాకు 5వేల చొప్పున రైతుబంధు డబ్బులు వేస్తుండడంతో రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలుచేసి పొలంబాట పట్టారు. ఆదివారం మండలంలోని గుండుమాల్ గ్రామంలో రైతులు రైతువేదిక వద్ద సంబురాలు జరుపుకొన్నారు. తాము అప్పుచేసే అవసరం లేకుండా రైతుల అరిగోస తెలిసిన మహానేత కాబట్టి రైతుబంధు సాయం అందిస్తున్నారని, రైతులు పొలంపనుల్లో ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఊరూవాడా రైతుబంధు సంబురాల్లో రైతులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని ఎంపీపీ మధుకర్రావ్ అన్నారు. కార్యక్రమంలో గుండుమాల్ సర్పంచ్ విజయలక్ష్మి, టీఆర్ఎస్ గ్రామ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
గ్రామాల్లో రైతుబంధు సంబురాలు
నారాయణపేటరూరల్, జనవరి 9: మండలంలోని వందర్గుట్టతండా, పేరపళ్ల తదితర గ్రామాల్లో రైతుబంధు సంబురాలను రైతులు ఘనంగా నిర్వహించారు. వందర్గుట్టతండాలో రైతులు, గ్రామ నాయకులు రైతుబంధుకు సంబంధించిన ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ పురవీధులు గుండా ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ కృష్ణనాయక్, ఎంపీటీసీ లాలూనాయక్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు, రైతు భీమా తదితర పథకాలను గ్రామస్తులకు వివరించారు. అనంతరం వ్యవసాయపొలంలో ప్రత్యామ్నాయ పంటలను పండించాలని సూచిస్తూ సంబురంగా ఫొటోలు దిగారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ వాచ్యానాయక్, వార్ఢు సభ్యులు బాలూనాయక్, రమేశ్నాయక్, ఏఈవో మహేశ్, యువకులు, మహిళలు పాల్గ్గొన్నారు.