కవాడిగూడ : నిరుపేద వృద్దులను, వికలాంగులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు ఆదివారం కవాడిగూడ డివిజన్ ఎల్చీగూడ బస్తీలో నివాసముండే వృద్ద వికలాంగురాలికి ట్రై సైకిల్ను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం వృద్దులు, వికలాంగుల అభివృద్దికి పెద్ద పీట వేస్తున్నదని అన్నారు.
ప్రభుత్వం పేదల అభివృద్దికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. వికలాంగులను ఆదుకునేందుకు సచ్చంద సంస్థలు ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, కవాడిగూడ డివిజన్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్ యాదవ్, కార్యదర్శి సాయికృష్ణ, సీనియర్ నాయకుడు వల్లాల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.