యాదాద్రి, జనవరి 5 : రైతుబంధు వారోత్సవాలు బుధవారం ఊరూరా ఉత్సాహంగా కొనసాగాయి. యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లిలో రైస్మిల్లుల వద్ద టీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. మాసాయిపేట, సాధువెల్లి, మల్లాపురం, రామాజీపేట, చిన్నకందుకూరులో మండల వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతుబంధు సంబురాలు చేశారు. మోటకొండూర్ మండలం దిలావర్పూర్లో జడ్పీటీసీ పల్లా వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో రైతుబంధు సంబురాలు జరిగాయి. వాకిటి గ్రామ పంచాయతీ మహిళలు ముగ్గులు వేశారు. సీఎం కేసీఆర్ బొమ్మను గీసి అలరించారు. మాటూరులో వైస్ ఎంపీపీ ఇల్లందుల మల్లేశ్గౌడ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
ఆత్మకూర్(ఎం)మండలంలో..
ఆత్మకూరు(ఎం) : మండల కేంద్రంతోపాటు కూరెళ్ల, పల్లెర్ల, రాఘవాపురం, ఉప్పలపహాడ్, పుల్లాయిగూడెం, మొరిపిరాలలో సంబురాలు జరిపారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద ముగ్గులతోపాటు స్వీట్లు పంపిణీ చేశారు. సర్పంచులు నగేశ్, నర్సింహారెడ్డి, ఉప్పలయ్య, కమలమ్మ, సరిత, గిరిజ, తిరుమల్రెడ్డి, ఎంపీటీసీ కవిత, ఏఓ శిల్ప, ఏఈఓలు సరిత, రాజశేఖర్, క్రాంతికుమార్, టీఆర్ఎస్ రైతు విభాగం మండలాధ్యక్షుడు నర్సిరెడ్డి, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు ధనలక్ష్మి, రైతులు పాల్గొన్నారు.
ఆలేరు మండలంలో..
ఆలేరురూరల్ : రైతుబంధు వారోత్సవాలు మండల వ్యాప్తంగా జరిగాయి. కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. సర్పంచులు వంగాల శ్రీశైలం, బండ పద్మ, ఆరుట్ల లక్ష్మీప్రసాద్రెడ్డి, బక్క రాంప్రసాద్, ఏసిరెడ్డి మహేందర్రెడ్డి, కోటగిరి పాండరి, నాయకులు మామిడాల అంజయ్య, ఆరె మల్లేశ్, మామిడాల నర్సింహులు, చిరబోయిన మల్లేశ్, జంగ స్వామి పాల్గొన్నారు.
రాజాపేట మండలంలో..
రాజాపేట : మండలంలోని బేగంపేటలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయగా, బసంతాపురంలో టీఆర్ఎస్ నాయకులు రైతులకు స్వీట్లు పంపిణీ చేశారు. కొత్తజాలలో నారుకట్టలతో రైతుబంధు, కేసీఆర్ పేర్లు పేర్చగా, సింగారంలో ర్యాలీ నిర్వహించారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి, సర్పంచులు ఠాకూర్ ధర్మేందర్సింగ్, కర్ల కరుణాకర్రెడ్డి, మెండు వెంకట్రెడ్డి, కరుణాకర్, టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు పల్లె సంతోష్గౌడ్, మండల కోశాధికారి కటకం స్వామి, రమేశ్ పాల్గొన్నారు.
తుర్కపల్లి మండలంలో..
తుర్కపల్లి : మండలంలోని బద్దుతండా, బీల్యాతండా, వీరారెడ్డిపల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి ర్యాలీలు నిర్వహించారు. వెంకటాపురం, ఇబ్రహీంపురం, వీరారెడ్డిపల్లి, రుస్తాపురంలో గ్రామపంచాయతీ కార్యాలయాలను పచ్చని తోరణాలతో అలంకరించారు. వెంకటాపురంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎంపీపీ సుశీలారవీందర్, సర్పంచ్ ప్రభాకర్రెడ్డి రైతులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. సర్పంచులు సురేశ్నాయక్, జ్యోతి, శ్రీవాణి, మహేందర్, లావణ్య, కల్లూరి శ్రీనివాస్రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ మండలంలో..
చౌటుప్పల్ రూరల్ : మండలంలోని ఎల్లంబావిలో రైతు బంధు సంబురాలు నిర్వహించారు. గ్రామపంచాయతీ ఎదుట ముగ్గులు వేశారు. కేక్కట్ చేసి స్వీట్లు పంచారు. మండల ప్రత్యేకాధికారి శ్రీలక్ష్మి, సర్పంచ్ గుర్రం కొండల్, డీహెచ్ఓ అన్నపూర్ణ, ఏఓ ముత్యాల నాగరాజు, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ కొత్త పర్వతాలుయాదవ్, గ్రామ కో ఆర్డినేటర్ కంది లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. డి.నాగారంలో మిఠాయిలు పంచారు. సర్పంచ్ కళ్లెం శ్రీనివాస్రెడ్డి, రైతులు పాల్గొన్నారు. పెద్దకొండూరులో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు ముప్పిడి శ్రీనివాస్గౌడ్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు పాక రమేశ్ యాదవ్, నాయకులు మల్లేశ్ యాదవ్, బద్దం పాండురెడ్డి, యాస అశోక్రెడ్డి, యాట వెంకటేశం పాల్గొన్నారు. ఎస్.లింగోటంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పీఏసీఎస్ వైస్ చైర్మన్ అంజయ్యగౌడ్, టీఆర్ఎస్ కార్యదర్శి మాధవరెడ్డి, యాదయ్య, ఆనంద్గౌడ్, శంకరయ్య పాల్గొన్నారు.
అడ్డగూడూరు మండలంలో..
అడ్డగూడూరు : మండల కేంద్రంతోపాటు చౌళ్లరామారం, గట్టుసింగారం, బొడ్డుగూడెం గ్రామ పంచాయతీల్లో రైతుబంధు వారోత్సవాలు నిర్వహించారు. రైతుబంధు, రైతుబీమా పథకాలపై అవగహన కల్పించారు. విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఎంపీపీ దర్శనాల అంజయ్య, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కొమ్మిడి ప్రభాకర్రెడ్డి, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.
గుండాల మండలంలో..
గుండాల : మండల వ్యాప్తంగా గ్రామపంచాయతీల వద్ద రంగవల్లులు వేసి స్వీట్లు పంపిణీ చేశారు. రామారంలో జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఖలీల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పీఏసీఎస్ డైరెక్టర్ శ్రీనివాస్, మజీ పీఏసీఎస్ చైర్మన్ మద్దుల బాల్రెడ్డి, రైతుబంధు సమితి గ్రామ కో ఆర్డినేటర్ మచ్చ చెన్నారెడ్డి, దొడ్డబోయిన ముత్యాలు, ఎలిపెద్ది వెంకట్రెడ్డి, గోపాల్దాస్ వెంకన్న, కోల యాకన్న, అట్ల రంజిత్రెడ్డి, మేడె రామచంద్రు, ఊట్ల శ్రీనివాస్, వట్టిపల్లి రాజయ్య, ఏఓ సంతోషి, రైతులు పాల్గొన్నారు.
వలిగొండ మండలంలో..
వలిగొండ : వలిగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కునపురి కవిత రైతులను సన్మానించారు. మాందాపురంలో రైతు బంధు సమితి మండల కన్వీనర్ పనుమటి మమతానరేందర్రెడ్డి, సర్పంచ్ సోలిపురం సాగర్రెడ్డి ఆధ్వర్యంలో, కేర్చిపల్లిలో టీఆర్ఎస్ మహిళ విభాగం మండలాధ్యక్షురాలు మద్దెల మంజుల ఆధ్వర్యంలో రైతు బంధు వారోత్సవాలు నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి అంజనీదేవి, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు బంధు సమితి కన్వీనర్లు, మార్కెట్ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.
బొమ్మలరామారం మండలంలో..
బొమ్మలరామారం : మండలంలోని మర్యాలలో సర్పంచ్ కుర్మిండ్ల దామోదర్గౌడ్ ఆధ్వర్యంలో రైతు బంధు వారోత్సవాలు నిర్వహంచారు. ఈ సందర్భంగా రైతుబంధు, రైతుబీమా పథకాలపై ర రైతులకు అవగాహన కల్పించారు. ఈ పధకాల ప్రాముఖ్యం గురించి తెలిపేవిధంగా మహిళలలకు ముగ్గుల పోటీ లు నిర్వహించి విజేతకలు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో వెంకటేశ్వర్లు, రైతులు, గ్రామస్తులు ,వార్డు సభ్యులు పాల్గొన్నారు.
మోత్కూర్ మండలంలో..
మోత్కూరు : రైతులందరికీ పెట్టుబడి సాయం పంపంణి చేసిన సీఎం కేసీఆర్ రైతుబాంధవుడని ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడపలో జరిగిన పాల్గొని మాట్లాడారు. పాటిమట్ల, దాచారంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి, జడ్పీటీసీ గోరుపల్లి శారదాసంతోష్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొణతం యాకూబ్రెడ్డి, రైతు బంధు సమితి మండల కో అర్డినేటర్ కొండ సోంమల్లు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్, సర్పంచులు, అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సంస్థాన్ నారాయణపురం మండలంలో…
సంస్థాన్ నారాయణపురం: రైతులు యాసంగిలో ఆరుతడి పంటలను సాగు చేయాలని డీఏఓ అనూరాధ సూచించారు. రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు. ఎంపీపీ ఉమాప్రేమ్చందర్రెడ్డి, సర్పంచ్ శ్రీహరి, ఎంపీటీసీ బచ్చనగోని గాలయ్య, ఏఓ ఉమారాణి, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.