ముషీరాబాద్ : జీహెచ్ఎంసీ సర్కిల్-15 ముషీరాబాద్ నియోజకవర్గంలో పుట్పాత్ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ మూడవ రోజు కొనసాగింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్కిల్-15 టౌన్ప్లానింగ్ అధికారులు సోమవారం పుట్పాత్లపై వెలసిన కట్టడాలను తొలగించారు. గోల్కొండ క్రాస్ రోడ్, ఆంధ్రాకేఫ్, అశోక్నగర్ తదితర ప్రాంతాల్లో పుట్పాత్ ఆక్రమణలను తొలగించారు.
టౌన్ప్లానింగ్ ఏసీపీ పావని ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది పుట్పాత్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలు, షాపుల తొలగించారు. ఈ కార్యక్రమంలో టౌన్ప్లానింగ్ అధికారులు దేవేందర్, సిబ్బంది జగన్, అనిల్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.