అంబర్పేట : గోల్నాక డివిజన్ తులసీరాంనగర్ (లంక) అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. మంగళవారం ఆయన లంక బస్తీలో పర్యటించి ప్రజల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. అక్కడ అరుగులపై కూర్చున్న వృద్ధుల దగ్గరకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగారు.
ప్రభుత్వం నుంచి ఆసరా పించను అందుతుందా? అని ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు పించన్ అందుతుందని ఎమ్మెల్యేకు తెలిపారు. బస్తీలో తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బస్తీ నాయకులు శ్రీనివాసరెడ్డి మల్లేష్గౌడ్, దేవేందర్, ప్రభాకర్, అంజయ్యచారి, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.