రవీంద్రభారతి : దీపావళి పండుగను పురస్కరించుకుని తెలంగాణ భాషాసాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో రవీంద్రభారతిలో ఘనంగా దీపావళి పండుగ పూజలను తెలంగాణ భాషా సాంస్కృతి శాఖ సంచాలకుల మామిడి హరికృష్ణ నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతాయని, దీపావళి పండుగ ప్రతి ఇంటిలో చీకట్లను తొలగించి దీపాలు వెలుగాలని, చెడును విస్మరించి మంచిని ప్రోత్సహించడమే నిజమైన దీపావళి పండుగన్నారు. రవీంద్రభారతిలోని సిబ్బందికి ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
ఉద్యోగులు సుఖసంతోషాలతో పండుగను నిర్వహించుకోవాలన్నారు. రవీంద్రభారతి దినదినం మరింత అభివృద్ధి చెంది నిత్యకళ్యాణం పచ్చతోరణంగా వర్థిల్లాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఉద్యోగులతో కలిసి లక్ష్మిపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రఘునందన్, ఎఫ్ఓ నాగరాజు, రవీంద్రభారతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.