చంపాపేట : టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధే లక్ష్యంగా డివిజన్ కమిటీలు పనిచేయాలని ఎల్బీనగర్ నియోజక వర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. గత వారంలో నియామకమైన టీఆర్ఎస్ చంపాపేట డివిజన్ నూతన కమిటి మంగళవారం టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నల్ల రఘుమారెడ్డి సమక్ష్యంలో ఎమ్మెల్యే సుధీర్రెడ్డిని వారి క్యాంప్ ఆఫీసులో మర్యాద పూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలియజేసి సన్మానం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన డివిజన్ కమిటీ పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేయా లని సూచించారు. చంపాపేట డివిజన్లో టీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా తిరుగులేని శక్తిగా తయారు చేయాలని వివరిం చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెల్లి పార్టీ ప్రతిష్టను పెంపొంధించాలని డివి జన్ కమిటిని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో చంపాపేట డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ముడుపు రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వర్, పార్టీ సీనియర్ నాయకుడు నల్ల రఘుమారెడ్డి, బీసీసెల్ అధ్యక్షుడు గోపాల్ ముధిరాజ్, యూత్ అధ్యక్షుడు రవి ముదిరాజ్, నాయకులు ఆనగొంధి జంగయ్య తదితరులు పాల్గొన్నారు.