కందుకూరు : రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని రాచులూరు దేవాలయం వద్ద గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపినట్లు గ్రామస్తులు తెలిపారు. మంగళవారం రాత్రి జాతర గుట్ట ఉన్న రామలయం వద్ద ఎవ్వరూ లేని సమయంలో నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు చేపట్టారు.
అక్కడ ఎమీ లభించకపోవడంతో తిరిగి వెళ్లిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ విషయంలో కందుకూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాగా పోలీసులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టిన వ్యక్తులను గుర్తించే పనిలో పడ్డారు.