గోల్నాక : అంబర్పేట నియోజకవర్గంలోని అన్ని బస్తీలు, కాలనీల్లో ఉన్న రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గోల్నాక డివిజన్లోని ఇందిరానగర్లో రూ.6 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాస్ గౌడ్తో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్పేట, బాగ్అంబర్ పేట డివిజన్లలో ఉన్న అన్ని బస్తీలలో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. గత మూడేండ్లలో చాలా రోడ్ల నిర్మాణం జరిగిందన్నారు. అవసరమైన చోట వీడీసీసీ రోడ్లను కూడా వేయించామని చెప్పారు.
నియోజకవర్గంలోని ప్రధాన రహదారులైన బర్కత్పుర నుంచి ఓయూ రోడ్డు, ఫీవర్ చౌరస్తా నుంచి తిలక్నగర్, కాచిగూడ మెయిన్రోడ్డు, అలీకేఫ్ నుంచి గోల్నాక, శ్రీరమణ చౌరస్తా నుంచి అలీకేఫ్, ఓయూ చౌరస్తా నుంచి ఛేనంబర్ రోడ్లను సీఆర్ఎంపీ రోడ్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.
అలాగే బస్తీలలో ఉన్న అంతర్గత రోడ్లను చాలా వరకు అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ సుధాకర్, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు కొమ్ము శ్రీనివాస్, బస్తీవాసులు రాములు, లక్ష్మణ్, వెంకటేశ్, జనార్ధన్, సుజాత, టీఆర్ఎస్ నాయకులు భూపతి లక్ష్మణ్, ఆర్కేబాబు, రాము, లింగంగౌడ్, బుచ్చిరెడ్డి, శేఖర్, దేవేందర్, నర్సింగ్యాదవ్, తదితరులు పాల్గొన్నారు.