ఉస్మానియా యూనివర్సిటీ : ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి అన్నారు. ఆపదలో ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తార్నాక డివిజన్కు చెందిన ఆర్. సుజాతకు సీఎంఆర్ఎఫ్ నుంచి వచ్చిన రూ.30 వేల చెక్కును లబ్ధిదారుకు డిప్యూటీ మేయర్ గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి, స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.