బండ్లగూడ : అనుమతులు తీసుకున్నంత వరకే భవన నిర్మాణాలను చేపట్టాలని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వేణుగోపాల్రెడ్డి సూచించారు.
సోమావారం బీజేఎంసీ పరిధిలోని పీరం చెరువు గ్రామంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు కమిషనర్ వేణుగోపాల్రెడ్డి ఆదేశాలతో టౌన్ప్లానింగ్ అధికారులు సాంబయ్య ఆధ్వర్యంలో సిబ్బంది నాలుగు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.