బండ్లగూడ : బైరాగిగూడ ప్రాంతంలోని పలు కాలనీలలో మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్లు చంద్రశేఖర్, రవీందర్రెడ్డిలు కాలనీ వాసులతో కలిసి ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ను కలిసి విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తిరుమలహిల్స్, శివసాయినగర్, వెంకటేశ్వర నగర్, విష్ణుపురి కాలనీ సుబ్రమణ్యం కాలనీ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా లేక పోవడంతో ప్రజలు నానా ఇబ్బందులకు గురౌతున్నారన్నారు. వెంటనే మంచి నీటి పైపు లైన్ల నిర్మాణం చేపట్టి మంచినీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మాట్లాడుతూ అధికారులతో చర్చించి రెండు నెలలలో మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చినట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు వెంకట్రెడ్డి, శరత్వంశీ, శ్రవణ్రెడ్డి, ప్రతాప్రెడ్డి, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.