ఎల్బీనగర్ : సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. పోలీస్ స్టేషన్లో ఒక్కసారిగా 9 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. సరూర్నగర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఇద్దరు ఎస్ఐలతో పాటుగా నలుగురు కానిస్టేబుళ్లు, ముగ్గురు హోంగార్డులకు కరోనా వైరస్ సోకింది. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో సిబ్బంది, అధికారులు అప్రమత్తమయ్యారు.
అదే విధంగా ఎల్బీనగర్ మూడు సర్కిళ్ల పరిధిలో, ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలోని అధికారులు, సిబ్బందిలో కూడా కొందరు కరోనా వైరస్ బారిన పడినట్లుగా అధికారులు పేర్కొంటున్నారు. పర్వదినాల నేపథ్యంలో కార్యాలయాలకు సెలవులు ఉండటంతో అంతా కాస్తా ఊపిరి పీల్చుకుంటున్నారు.