ఎల్బీనగర్ : ఫిబ్రవరి నెలఖరు వరకు ఆలేఖ్య టవర్స్ నుండి సాగర్ రింగ్రోడ్డు వరకు ఫ్లై ఓవర్, ఎల్బీనగర్ అండర్పాస్ పనులను పూర్తి చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఆదేశించారు.
బుధవారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులు, సమగ్ర రోడ్డు అభివృద్ది కార్యక్రమం (ఎస్ఆర్డీపీ) అధికారులతో ఎమ్మెల్యే సుధీర్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్లో ఎస్ఆర్డీపీ పనులతో రూపురేఖలు మారుతాయన్నారు.
సాగర్ రింగ్రోడ్డు నుండి చింతలకుంట వరకు నిర్మించనున్న ఫ్లై , స్కై ఓవర్ పనులను వేగవంతం చేయాలన్నారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని ఎల్బీనగర్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఇ రవీందర్రాజు, ఈఈ రోహిణి, డిఇ కార్తిక్, ప్రాజెక్ట్ మేనేజర్ మల్లికార్జున్, డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.