మెహిదీపట్నం : తాగడానికి డబ్బులు ఇస్తావా లేదా అని ఓ తాగుబోతు బ్లేడ్తో ఓ వ్యక్తిపై దాడి చేసి గాయ పరచిన సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….ఖాజాగూడకు చెందిన అమీర్షరీఫ్ (26), ఫిలింనగర్కు చెందిన జగత్బాబు (20) స్నేహితులు.
సోమవారం మధ్యాహ్నం టోలిచౌకి బృందావన్ కాలనీలో వీరిద్దరు కలిశారు. అప్పటికే మద్యం తాగి ఉన్న అమీర్షరీఫ్ జగత్బాబును మద్యం కోసం డబ్బులు కావాలని అడిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కోపోద్రిక్తుడైన అమీర్షరీఫ్ తన వద్ద ఉన్న బ్లేడ్తో జగత్బాబుపై దాడి చేసి గాయపరచి పారిపోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జగత్బాబును చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.