గోల్నాక : పలు వ్యాధుల భారిన పడి దవాఖానల్లో చికిత్స పొందుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.
సోమవారం గోల్పాకలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనారోగ్యంతో బాధ పడుతూ దవాఖానలో చికిత్స పొందుతున్న గోల్నాక డివిజన్ దుర్గానగర్కు చెందిన ఎల్.వెంకటరెడ్డికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.3లక్షల 50వేల విలువగల చెక్కును ఆయన బాధితుడి కుటుంబసభ్యులకు అందజేశారు.