జూబ్లీహిల్స్: తెలంగాణ మహిళల ధీరత్వానికి చాకలి ఐలమ్మ ప్రతీకగా నిలుస్తుందని.. సామాజిక, ఆధునిక పరిణామానికి నాంది పలికిన ధైర్యశాలి అని ఫస్ట్ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ అనూప్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు. తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని ఆదివారం యూసుఫ్గూడ ప్రథమ పటాలంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్స్ జి.రాజు, కె.సంపత్ కుమార్ రెడ్డి, జె.రాందాస్, బి.జవహర్లాల్, ఆర్ఐలు ఎ.నరసింహ, డి.ధర్మారావు, ఎస్.సురేష్, టి.సాంబయ్య, ఎండి.జాఫర్, ఆర్.శంకర్లతో పాటు ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు.