చిన్నంబావి, డిసెంబర్ 8 : కులవృత్తులను ప్రోత్సహించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం గొర్రెల పంపిణీని చేపట్టిందని, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని దగడపల్లి గ్రామంలో పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యం లో గొల్ల, కురుమలకు 44 యూనిట్ల గొర్రెలను (ఒక్కో యూనిట్లో 20 గొర్రెలు, 1 పొట్టేలు) పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలను సందర్శించి, మంజూరైన మూడు అదనపు గదుల నిర్మాణాన్ని వెంటనే చేపట్టి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ సోమేశ్వరమ్మ, జెడ్పీటీసీ వెంకట్రామమ్మ, కొప్పునూరు విండో చైర్మన్ నర్సింహారెడ్డి, సర్పంచ్ సువర్ణమ్మ, ఎంపీటీసీ మౌలాలి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఈదన్నయాదవ్, నాయకులు చిన్నారెడ్డి, ఈశ్వర్రెడ్డి, చిదంబర్రెడ్డి, కురుమయ్య, గాలియాదవ్, ఆనంద్యాదవ్, శంకరయ్య, గంగాధర్, ఆనంద్, మల్లికార్జున్, కర్రెన్న, లబ్ధిదారులు పాల్గొన్నారు.