మారేడ్పల్లి : కంటోన్మెంట్ నాలుగవ వార్డు భూలక్ష్మి ఆలయం వద్ద సీడీపీ నిధుల నుంచి హెచ్టీ కరెంటు లైన్ షిప్టింగ్ పనులను సోమవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న, మాజీ బోర్డు ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మాజీ బోర్డు సభ్యురాలు నళిని కిరణ్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, బస్తీ వాసులు పాల్గొన్నారు.