ముషీరాబాద్: టీఎస్ఎస్పీడీసీఎల్ ఆజామాబాద్ డివిజన్ పరిధిలోని 11 కేవీ సంజీవయ్యనగర్, గాంధీకుటీర్ ఫీడర్ల పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మత్తుల కారణంగా 2తేదీ(నేడు)గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆ విభాగం ఏడీఈ ఎం.విజయభాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు. సంజీవయ్యనగర్ ఫీడర్ పరిధిలోని మదర్ డైరీ పార్కు, ఇందిరానగర్, సంజీవయ్యనగర్, ఇండియన్ ఐస్క్రీమ్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదు.