మణికొండ : పోచమ్మ గ్రామదేవత భోనాల ఉత్సవాలు నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో ఖానాపూర్ గ్రామంలో శుక్రవారం భక్తిశ్రద్దలతో అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామస్థులు సమిష్టి కృషితో నూతనంగా నిర్మించిన అమ్మవారి దేవాలయ ప్రతిష్టాపనోత్సవాలు గత నాలుగురోజులుగా వేదపండితుల మంత్రోచ్చరణల నడుమ వైభవోపేతంగా కొనసాగాయి.
చివరిరోజు శుక్రవారం గ్రామస్థులు ఇంటింటి నుంచి భోనాల ఊరేగింపుగా తీసుకుని పోతురాజుల ఆటాపాటలతో అమ్మ వారికి బోనాలను సమర్పించారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ ప్రతినిధులు నూతన దేవాలయానికి వేయికండ్ల బోనం, ఘటాల ఊరేగింపు చేపట్టి అమ్మవారికి ఒడిబియ్యాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఖానాపూర్ గ్రామం నుంచి మహిళలు పెద్ద ఎత్తున బోనాలను ఊరేగింపుగా తీసుకువచ్చి తమ మొక్కులను తీర్చుకున్నారు. శివసత్తుల ఆటాపాటలతో అమ్మవారిని శాంతింపచేశారు. గడిచిన ఐదురోజులుగా ఖానాపూర్ గ్రామంలో చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా పోచమ్మదేవాలయానికి తరలివచ్చి తమ మొక్కులను తీర్చుకున్నారు.
ఈ సందర్బంగా మాజీ ఎంపీపీ మల్లేష్, కౌన్సిలర్ అమరేందర్రెడ్డి, మాజీ సర్పంచ్ గండయ్య, నర్సింహ్మ, నిర్వాహకులు వెంకటేష్యాదవ్, రాంచంద్రారెడ్డి,విఠలయ్య, శంకరి రమేశ్, సహకార సంఘ డైరెక్టర్లు క్రిష్ణ, రామకృష్ణారెడ్డి, భిక్షపతి, నాయకులు విఠల్రెడ్డి,గణేష్, చంద్రమౌళి,బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.