బన్సీలాల్పేట్ : పేదలందరికీ నాణ్యమైన విద్య అందించాలని, విద్య ఒక్కటే పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును అందిస్తుందని నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్ అన్నారు. బన్సీలాల్పేట్ డివిజన్, భోలక్పూర్లోని మేకలమండి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు అదనపు తరగతి గదుల నిర్మాణానికి నిధులను కేటాయించాలని కార్పొరేటర్ కే.హేమలత, సోమవారం ఆయనను కలిసి రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సిఫారసు చేసిన లేఖను అందించారు.
ఈ సందర్భంగా స్టీఫెన్సన్ మాట్లాడుతూ విద్యావ్యవస్థ బలోపేతానికి తన వంతు సహాయ సహకారం అందించడానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు బి.నర్సింగ్రావు, టీఆర్ఎస్ నాయకులు కే.లక్ష్మిపతి, ఎన్.ప్రేమ్కుమార్, ఫహీమ్, అబ్బాస్, జావెద్, రుక్ముద్దీన్, మురళి, వెంకటేశ్ యాదవ్లు పాల్గొన్నారు