బొంరాస్పేట, నవంబర్ 23 : ఆన్లైన్ లావాదేవీలు, కార్యకలాపాలు పెరిగే కొద్దీ సమాజంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, విద్యార్థులు వీటి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని ఎంఈవో రాంరెడ్డి, ఎస్ఐ వెంకటనా రా యణ అన్నారు. మంగళవారం మండలంలోని దుద్యాల జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాల, చెట్టుపల్లితండా కేజీబీవీలో సైబర్ నేరాలపై అవగాహన కోసం సైబర్ కాంగ్రెస్ నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ రోజు ఏ పని జరగాలన్నా ఆన్లైన్పై ఆధారపడాల్సి వస్తుందని దీనిని ఆస రాగా చేసుకుని సైబర్ దొంగలు అమాయక ప్రజలను నిలువునా మోసం చేసి డబ్బులు కాజేస్తున్నారన్నారు. విద్యార్థులు వీటిపట్ల జాగ్రత్తగా ఉంటూ తల్లిదండ్రులను కూడా చైతన్యం చేయాలని, ఫోన్లకు వచ్చే వాట్సాప్ మెసేజ్లను క్లిక్ చేయరాదని, ఓటీపీని ఎవరికీ చెప్పవద్దని, గుర్తు తెలియని వ్యక్తులు చేసే ఫోన్ కాల్కు స్పందించరాదని, తమ వ్యక్తిగత వివరాలను ఎవ రికీ చెప్పవద్దని ఎంఈవో రాంరెడ్డి, ఎస్సై వెంకటనారాయణ సూచించారు.
ప్రత్యేక నియామకాలతో శిక్షణ
కొడంగల్, నవంబర్ 23: సైబర్ నేరాలపై అవగాహన పెంచుకొని అప్ర మత్తంగా ఉండాలని ఎంఈవో రాంరెడ్డి తెలిపారు. మంగళవారం మండలం లోని రావులపల్లి గ్రామ జిల్లా పరి షత్ ఉన్నత పాఠశాలలో ప్రధానో పాధ్యా యులు శ్యామల ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలపై అవగాన కల్పించేం దుకు గాను విద్యార్థులు, ఉపాధ్యాయులను ప్రత్యేకంగా నియామకం చేసి శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాని స్టేబుల్ పృథ్వీరాజ్, ఎస్ఎంసీ చైర్మన్ అశోక్తో పాటు చెన్నబస్వారెడ్డి పాల్గొన్నారు.
సైబర్ అంబాసిడర్ల ఎంపిక
పెద్దేముల్ , నవంబర్ 23 : సైబర్ నేరాలు, మోసాల పట్ల విద్యార్థులు అను క్షణం జాగ్రత్తగా ఉండాలని మంబాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.రాములు సూచించారు.మంగళవారం మండల పరిధిలోని మంబాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం సైబర్ అంబాసిడర్లను విద్యార్థుల సమక్షంలో ఎన్నుకొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ శ్రీనివాస్,ఎంపీటీసీ యాలాటి శ్రీనివాస్, పోలీసు కానిస్టేబుల్ నరేశ్, మెంటార్ టీచర్ రేణుక, టీచర్ స్రవంతి పాల్గొన్నారు.
కులకచర్ల, నవంబర్ 23 : సైబర్ నేరగాళ్ల చేతుల్లో ఎవ్వరూ మోసపోవద్దని కులకచర్ల ఎస్ఐ శ్రీనివాస్ అన్నారు. కులకచర్ల మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో కులకచర్ల బాలుర, బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోతున్నారని తెలిస్తే వెంటనే 1552 60 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని అన్నారు.
యాలాల నవంబర్ 23 : సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని ఎస్సై సురేశ్ అన్నారు. మంగళవారం యాలాల మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్య క్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఈవో సుధాకర్ రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ సాయిలు పాల్గొన్నారు.