బడంగ్పేట: మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న వరద నీటీ కాలువ పనులను విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం పరిశీలించారు. అవుట్లేట్ పనులు ఎంత వరకు వచ్చాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువులలోకి వరదనీరు ఏ విధంగా వస్తుందో అధికారులు అంచనా వేయాలన్నారు. నీటిని దిగువకు వదలడానికి అవసరం అయిన చర్యలు తీసుకోవాలన్నారు.
చెరువు పరిసరాలలో ఉన్న కాలనీ ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, ఎలక్టీసిటీ, పోలీసులు ప్రజలకు అందుభాటులో ఉండాలన్నారు. కంట్రోల్ రూమ్కు ఎలాంటి పోన్లు వచ్చినా స్పందించాలన్నారు. అవసరం అయితే ప్రజలను పునరా వాస కేంద్రాలకు తరలించాలన్నారు. సహయక చర్యలు చేపట్టడానికి టీమ్లు సిద్దంగా ఉండాలన్నారు. భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగ కుండా చూసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, తాసీల్ధార్ డి శ్రీనివాసరెడ్డి, కార్పొరేటర్స్ అర్కల భూపాల్రెడ్డి, సిద్దాల లావణ్య బీరప్ప, నవీన్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ మీర్పేట అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి, రమేష్, తీగల సాయి నాథ్రెడ్డి , అధికారులు తదితరులు ఉన్నారు.