మన్సూరాబాద్ : కష్టపడి పనిచేసే వారికి టీఆర్ఎస్ పార్టీలో తప్పకుండా సముచిత స్థానం లభిస్తుందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి చంద్రపురికాలనీకి చెందిన మాజీ అధ్యక్షుడు, మాజీ వార్డు కమిటీ సభ్యుడు రుద్ర యాదగిరి శుక్రవారం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డిని కలుసుకున్నారు. పార్టీలో సముచిత స్థానం కల్పించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు.
మలిదశ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన తనకు పార్టీ కోసం పని చేసే అవకాశం కల్పించాలని ఎమ్మెల్యేను కోరారు. పార్టీ అభివృద్ధికోసం పాటు పడేవారికి టీఆర్ఎస్ లో తగిన గౌరవం లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపినట్లు రుద్ర యాదగిరి తెలియజేశారు.