అత్తాపూర్ : హైదర్గూడ హిందు స్మశానటికకు 5 ఎకరాల స్థలం కేటాయిస్తామని మూసీ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ ఎమ్మెల్యే సుదీర్రెడ్డి హమీ ఇచ్చారు. మంగళవారం అత్తాపూర్ డివిజన్లోని హైదర్గూడ మూసీ వద్ద స్మశానవాటికను స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్, ఎంపీ రంజిత్రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు.
గత కొద్ది రోజులుగా స్మశానవాటిక అభివృద్ది విషయంలో మూసీ డెవలప్మెంట్, రెవెన్యు అధికారులు అడ్డుపడు తుండంతో మంగళవారం అన్ని శాఖల అధికారులతో కలిసి ఆయన స్థలాన్ని పరీశీలించారు. ఈ సందర్బంగా సుధీర్రెడ్డి మాట్లాడుతూ… రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ ఆహ్వానం మేరకు రావడం జరిగిందన్నారు.
స్మశానవాటిక వద్ద నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని, ప్రసుత్తం హైదర్గూడ మూసీ నది నుంచి నాగోల్ వరకు మూసీ అభివృద్ది పనులు జరుగుతున్నాయని తెలిపారు. దీని కారణంగా ప్రస్తుతం ఉన్న స్మశానవాటిక రోడ్డు వెడల్పులో భాగంగా కనుమరుగయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.
దీంతో మూసీ నదికి ఆనుకొని 36 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని అందులో నుంచి 5 ఎకరాల స్థలాన్ని హైదర్గూడ హిందు స్మశానవాటికకు కేటాయించి సుందరంగా స్మశానవాటికను నిర్మిస్తాం అని తెలిపారు. అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న స్మశానవాటికను ఉపయోగించుకోవాలని ఎలాంటి ఇబ్బందులు లేకుండా నూతన స్మశానవాటిక నిర్మాణం జరిగే వరకు అన్ని శాఖల అధికారులు సహకరిస్తారని ఆయన హామిఇచ్చారు.
మూసీ నదిని సర్వాంగసుందరంగా తీర్చిదిద్ది హైదరాబాద్ ప్రజలకు కానుకగా ఇవ్వాలన్న కోరికతో సీయం కేసీఆర్ ఉన్నారని అందుకు తగ్గట్టుగానే మూసీ నదిని 11వేల కోట్లతో అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. మూసీ అభివృద్దిలో భాగంగా మూసీ బఫర్జోన్లో నిర్మించిన నిర్మాణాలు తొలగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులతో పాటు, స్థానిక కార్పొరేటర్ సంగీత, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, యువజనసంఘాల సభ్యులు పాల్గొన్నారు.