ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి
గద్వాల రూరల్, డిసెంబర్ 27 : పేదింటి ఆడపిల్లల పెండ్లి కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టి వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మెళ్లచెర్వు, రేపల్లి, కొండపల్లి, కుర్వపల్లి, పరుమాల, కాకుళారం, సంగాల, కొత్తపల్లి, వీరాపురం, పూడూరు, గుర్రంగడ్డ, మదనపల్లి, ఈడీగోనిపల్లి, శెట్టిఆత్మకూర్ తదితర గ్రామాల్లో 137 మందికి లబ్ధిదారులకు ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి కల్యాణలక్ష్మి , షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో పేదింటి ఆడపిల్లల పెండ్లి అంటే తల్లిదండ్రులు భారంగా భావించేవారని, వారి కష్టాలను గుర్తించిన సీఎం కేసీఆర్ పేదింటి ఆడపిల్లల పెండ్లి కోసం కల్యాణలక్ష్మి,షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకం ద్వారా రూ.లక్షా నూటపదహరు అందజేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో కులమతాలకు,పార్టీలకతీతంగా ఆడపిల్ల పెండ్లి కానుకగా కల్యాణలక్ష్మి పథకం అమలు చేస్తున్నారని తెలిపారు. అలాగే గ్రామాల రూపురేఖలు మార్చాలనే ఉద్దేశంతో ప్రతి పల్లెలో రైతువేదికలు, పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు, పంచాయతీ ట్రాక్టర్, డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారన్నారు. కల్యాణలక్ష్మి డబ్బులను వృథా చేసుకోవద్దని సూచించారు.
నిరుపేదలకు వరం ‘సీఎం సహాయనిధి’
నిరుపేదలకు వరం సీఎం సహాయనిధి అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని కుర్వపల్లి, కొత్తపల్లి, శెట్టిఆత్మకూర్ తదితర గ్రామాల్లో సీఎం సహాయనిధి చెక్కులను బాధితుల ఇంటికివెళ్లి ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం సహాయనిధి నుంచి పెద్దరామన్నకు రూ.18వేలు, శ్రీరాములుకు రూ.1.25లక్షలు, నాగేష్కు రూ.1.30 లక్షల చెక్కు మంజూరైందని తెలిపారు. అనంత రం బాధిత కుటుం బ సభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఉమ్మడి జిల్లా పీఏసీసీఎస్ డైరెక్టర్ సుభాన్, జెడ్పీ వైస్ చైర్పర్సన్ సరోజమ్మ, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, మార్కెట్ యార్డు చైర్పర్సన్ రామేశ్వరమ్మ, ఎంపీపీ ప్రతాప్గౌడ్, వైస్ఎంపీపీ దామోదర్, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ సంజీవులు, మండలాధ్యక్షుడు రాముడు, సర్పంచులు దేవకర్ణమ్మ, మహేశ్వరి, విజయలక్ష్మి, శివమ ణి, అశోక్రెడ్డి, బాలకృష్ణారెడ్డి, వాసు, మన్యం, గోపాల్, సునీత, పావని, కృష్ణ, ఎంపీటీసీలు, సింగిల్ విండో డైరెక్టర్లు, టీఆర్ఎస్ నాయకులు రమేశ్ నాయుడు, శివకుమార్, మహేశ్వర్రెడ్డి, నర్సింహారెడ్డి, విశ్వనాథ్రెడ్డి, గోపిరెడ్డి, దామోదర్రెడ్డి, సత్యనారాయణ, జగదీశ్వర్రెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, కరుణాకర్రెడ్డి, కురుమన్న, నాగరాజు, కృష్ణ, లక్ష్మన్న, అశోక్, వెంట్రాములు పాల్గొన్నారు.