సుప్రియో చక్రవర్తి
మేళ్లచెర్వు, డిసెంబర్ 26 : సిమెంట్ పరిశ్రమలు, గనుల్లో పని చేసే కార్మికుల భద్రతకు మరింత కృషి చేయాలని మైన్స్ అండ్ సేఫ్టీ డైరెక్టర్ సుప్రియో చక్రవర్తి సూచించారు. ఆదివారం మండల పరిధిలోని రెయిన్బో సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం రెయిన్బో సిమెంట్స్కు మైన్స్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అవార్డు, సేఫ్టీ మైనింగ్, హెవీ ఎర్లీ మూవింగ్లో మొదటి బహుమతి, లోడింగ్, ట్రాన్స్పోర్ట్ విభాగంలో రెండో బహుమతిని ప్రదానం చేశారు. అనంతరం స్వతంత్ర సమరయోధుడు దొడ్డా నర్సింహారావును సన్మానించారు. మైహోం సిమెంట్స్కు చెందిన వేపలమాదారం, చౌటపల్లి గనులకు మొదటి, రెండవ బహుమతులు దక్కినట్టు ప్లాంట్ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు శ్యామ్మిశ్రా, సంజయ్కుమార్, ఫ్యాక్టరీ యజమాన్యం మూర్తి, స్వామి, పంకజ్, నాగేశ్వర్రావు, అప్పలరాజు, సూర్యనారాయణ నరేశ్ పాల్గొన్నారు.
పాలకవీడు : గనుల భద్రతా వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన పలు పోటీల్లో మండలంలోని భవానీపురం దక్కన్ ఫ్యాక్టరీకి ఓవరాల్ పర్ఫార్మెన్స్లో ప్రథమ బహుమతి లభించినట్లు ఆ సంస్థ జీఎం శ్రీనివాసరాజు తెలిపారు. మేళ్లచెర్వు మండలం రెయిన్ సిమెంట్లో నిర్వహించిన పోటీల్లో ఈ బహుమతి దక్కినట్లు వెల్లడించారు. సమావేశంలో ఫ్యాక్టరీ జీఎం నాగమల్లేశ్వర్రావు, డీజీఎం కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు.