ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
నమస్తే తెలంగాణ దిన పత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ
కోదాడ టౌన్, డిసెంబర్ 26 : పత్రికలు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నమస్తే తెలంగాణ దినపత్రిక 2022 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ చరిత్ర, సంస్కృతికి నిలువుటద్దంగా పత్రిక నిలిచిందన్నారు. అన్ని రకాల పాఠకుల ఆదరాభిమానాలు పొందిందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.
దైవభక్తి కలిగి ఉండాలి
కోదాడ రూరల్ : సమాజంలోని ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. ఆదివారం కోదాడ అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించిన పడిపూజలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం అన్నదానాన్ని ప్రారంభిచారు. కార్యక్రమంలో ఎంపీపీ కవితారెడ్డి, రేపాల ప్రసాదరావు, చల్లా రామ్మూర్తి, ఓరుగంటి వెంకటేశ్వర్లు, చంటి, ఎదులాపురం శ్రీను, కంచుకొమ్ముల సైదులు, వీరస్వామి, దంతాల నాగయ్య, దమయంతి, అయప్ప మాలధారులు, భక్తులు పాల్గొన్నారు. అలాగే పట్టణ పరిధిలోని కొమరబండలో టీఆర్ఎస్ లీగల్ సెల్ కోదాడ నియోజవర్గ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. బార్ అసోసియేసన్ అధ్యక్షుడు నాగార్జున, సెల్ కన్వీనర్, చింతకుంట్ల రామిరెడ్డి, సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.