సీపీఐ నాయకులు
కోదాడ రూరల్ల్, డిసెంబర్ 26 : ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటమే సీపీఐ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్న చంద్రశేఖర్ అన్నారు. సీపీఐ 97వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కోదాడ పట్టణంలో 97 అరుణ పతాకాలతో ఖమ్మం క్రాస్ రోడ్డు నుంచి రంగా థియేటర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు, మేకల శ్రీనివాస్రావు, బొల్లు ప్రసాద్ పాల్గొన్నారు.
నేరేడుచర్ల : సీపీఐ పార్టీ 97వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాల ధనుంజయనాయుడు మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎర్ర జెండాల పాత్ర ఎంతో కీలకమన్నారు. అనంతరం సీపీఐ పార్టీ పతాకాన్ని ఏఐటీయూసీ పట్టణాధ్యక్షుడు శ్రీరాములు ఆవిష్కరించారు. బడా పెట్టుబడుదారులకు కేంద్రం వత్తాసు పలుకుతుందని సీపీఐ పెంచికల్దిన్నె గ్రామ కార్యదర్శి అల్వాల శ్రీధర్, మండల నాయకులు మర్రి నాగేశ్వర్రావు అన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి రావుల సత్యం, సహాయ కార్యదర్శి కత్తి శ్రీనివాస్ రెడ్డి, ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ చిలకరాజు శ్రీను, ఏఐటీయూసీ పట్టణ ప్రధాన కార్యదర్శి అయిల నాగేశ్వర్రావు, రైతు సంఘం నాయకులు కత్తి వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
గరిడేపల్లి : దోపిడీ, పీడనలు ఉన్నంత కాలం పేద ప్రజల తరుపున కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు చేస్తుందని ఆ పార్టీ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు అన్నారు. మండల కేంద్రంతో పాటు గానుగుబండ, కొండాయిగూడెం గ్రామాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో ప్రజానాట్యకళా మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి బాదె నర్సయ్య పాల్గొన్నారు.
చింతలపాలెం : మండల కేంద్రంలో నిర్వహించిన సీపీఐ అవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఉస్తేల నారాయణరెడ్డి పాల్గొని జెండా అవిష్కరించారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి చింతిరాల రవి, గ్రామశాఖ కార్యదర్శి అంకరాజు, నాయకులు సురేందర్, వీరబాబు పాల్గొన్నారు.