మల్లన్న అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు
పరిగి/షాబాద్, డిసెంబర్ 25 : ఏదైనా ప్రతిపక్ష పార్టీ ఒక అంశం ప్రాతిపదికన విమర్శలు చేయడం సహజం. తద్వారా ప్రజలకు మేలు చేకూరేలా ఉండాలి. ఏదైనా రాజకీయ విమర్శ ఉంటే ఆ విమర్శలో సైతం హుందాతనం ఉంటే ప్రజలు సైతం ప్రతిపక్ష పార్టీల తీరును హర్షిస్తారు. తద్వారా ప్రజాభిమానం పొందాలి. అలాంటిది బీజేపీ నేతలు సంస్కారహీనంగా సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై విమర్శలు చేయడంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఓవైపు కేంద్రం చిల్లిగవ్వ సహాయం చేయకున్నా రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్దిని పరుగులు పెట్టిస్తున్నది. దేశానికే తలమానికంగా నిలిచేలా, పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. రాజకీయంగా టీఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక సంస్కారహీనంగా పిల్లలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడంపై సభ్య సమాజం, ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా మండిపడుతున్నారు. బీజేపీది ఇదేమి రాజకీయం, ఇంత నీచంగా రాజకీయాలను దిగజార్చడం తగదంటూ బీజేపీ నేతల తీరుపై మండిపడుతున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షుపై తీన్మార్ మల్లన్న బాడీ షేమింగ్కు పాల్పడడం సరైంది కాదంటున్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇతరులను తిట్టడానికి, వారిపై బురద జల్లడానికి కాదని, జర్నలిజం ముసుగులో అసత్యాలు, వదంతులు, చెత్తను ప్రసారం చేయడం తగదని పలువురు పేర్కొంటున్నారు. చిన్నపిల్లలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే కుసంస్కారం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనలేక సీఎం కేసీఆర్ కుటుంబంపై తీన్మార్ మల్లన్న ఇలాంటి చెత్త రాతలు రాస్తున్నారని, తీన్మార్ మల్లన్నకు గుణపాఠం తప్పదని పలువురు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వారిని బీజేపీ ప్రోత్సహిస్తుండడం గమనిస్తే ఆ పార్టీ తీరు పట్ల ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకుడు చేయాల్సిన పనులా ఇవి అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
సెంటిమెంట్ రాజకీయాలకు ప్రజలు బుద్ధి చెబుతారు
అభివృద్ధి ఎజెండాను టీఆర్ఎస్ నమ్ముకుంటే బీజేపీ కుల, మతాల పేరుతో సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నది. సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులపై రాతలు రాస్తూ నీచ రాజకీయాలకు దిగజారుతున్నది. బీజేపీకి నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే రాష్ర్టానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, తెలంగాణ రైతులకు జరుగుతున్న అన్యాయంపై నేతలను నిలదీయాలి. వీటిని పక్కకుపెట్టి పసలేని నీతిమాలిన రాజకీయం చేయడం హేయమైన చర్య.
కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేయడం సిగ్గుచేటు
రాష్ర్టాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని తీన్మార్ మల్లన్న అనే దొంగ టార్గెట్ చేయడం ఎంతో సిగ్గుచేటు. మీడియా ముసుగులో కొన్ని పార్టీలే, నేతలకు తొత్తుగా మారి టీఆర్ఎస్ను, కేసీఆర్ కుటుంబాన్ని తరచూ విమర్శించడం తగదు. అభివృద్ధి హిమాన్షు శరీరంలో కాదు రాష్ట్రంలో ఏదో ఒక పథకంతో లబ్ధి పొందుతున్న ప్రతి ఒక్కరిలో అభివృద్ధి కనిపిస్తుంది. జర్నలిజం పేరుతో పూట గడుపుకునే నీకు అభివృద్ధి గురించి ప్రశ్నించే హక్కులేదు. ఇంకోసారి కేసీఆర్ కుటుంబం జోలికొస్తే ఊరుకునే ప్రసక్తేలేదు. అంతకంత అనుభవించక తప్పదు కాస్కో.
స్థాయిని మరిచి మాట్లాడటం తగదు : శివకుమార్గౌడ్, నవాబుపేట
స్థాయిని మరిచి మాట్లాడటం బీజేపీ నేతలకే చెల్లుతుంది. కేంద్ర ప్రభుత్వ మంత్రులనుగాని ఎంపీలపై విమర్శలు చేసేటప్పుడు టీఆర్ఎస్ నేతలు ఏ సందర్భంలోనూ నోరుజారలేదు. కానీ ఇవ్వాల వార్డు మెంబర్గా కూడా గెలువని వారు సీఎం, మంత్రులు అనే భేదం లేకుండా దిగజారి మాట్లాడటం సంస్కారం కాదు. హిందు మతస్తులం అని చెప్పడం కాదు దాని ఆచరణలో చూపాలి. ఓట్ల కోసం తప్ప బీజేపీ నేతలు దేనికోసం పనికిరారని ప్రజానీకం గమనిస్తున్నది. మన స్థాయిని బట్టి మాట్లాడాలి. ఇప్పటికైనా బీజేపీ నాయకులు ఒళ్లు దగ్గరబెట్టుకుని మాట్లాడాలి. లేకపోతే ప్రజలు వారిని శిక్షిస్తారు.
బీజేపీది నీచ రాజకీయం
ఇంత అసమర్థ కేంద్ర ప్రభుత్వాన్ని చూడలేదు. బీజేపీ రాజకీయంగా టీఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్ము లేక దిగజారుడు రాజకీయాలు చేస్తున్నది. తీన్మార్ మల్లన్న రాజకీయంగా టీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా లేక సీఎం కేసీఆర్ కుటుంబంపై చెత్త రాతలు రాస్తుండు. అలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేవారు టీఆర్ఎస్లో ఎవరూ లేరు. అబద్ధాలను వ్యాప్తి చేయడానికి సోషల్ మీడియాను ఉపయోగించడమే కాకుండా చిన్న పిల్లలను కామెంట్ చేయడం నీచ సంస్కృతికి నిదర్శనం.
దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి
మంత్రి కేటీఆర్ కొడుకును రాజకీయాల్లోకి లాగడం బీజేపీ నేతల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనంగా కనిపిస్తున్నది. రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగుతున్న టీఆర్ఎస్ను చూసి ఓర్వలేక కొందరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణలో ఏం అభివృద్ధి జరిగిందనే వారికి ప్రజలే బుద్ధి చెబుతారు.
జర్నలిజం ముసుగు తొడిగిన దొంగ
మల్లన్నను ప్రజలు నమ్మే స్థితిలో లేరు
తీన్మార్ మల్లన్నను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. జర్నలిజం ముసుగులో బతుకుతున్న ఓ క్రిమినల్ మల్లన్న. రాజకీయం చేస్తే రాజకీయంగానే ఎదుర్కోవాలి, కానీ వ్యక్తులను, కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ ఉనికి కాపాడుకోవడం సరికాదు. ఎప్పుడైతే మల్లన్న బీజేపీలో చేరిండో అప్పుడే జనంలో స్థానం కోల్పోయిండు. మల్లన్న నిజమైన జర్నలిస్టు అయితే అధికార పార్టీ కాకుండా ఇతర పార్టీల నాయకుల అవినీతిని కూడా బయటపెట్టాలి. సీఎం కేసీఆర్ను, వారి కటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శించడం సరికాదు. మల్లన్న ఇప్పటికైనా మారాలే, లేకుంటే రానున్న రోజుల్లో తెలంగాణలో అతనికి గడ్డు పరిస్థితులు తప్పవు.