ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
బాధితుల పక్షాన నిలబడుతానని హామీ
కవాడిగూడ, డిసెంబర్ 25: నియోజకవర్గంలోని హుస్సేన్ సాగర్ నాలా పరీవాహక ప్రాంత ప్రజలు ఇండ్లు కోల్పోకుండా అండగా ఉంటామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. బాధితుల పక్షాన సీఎం కేసీఆర్తో మాట్లాడుతానని ఆయన హామీ ఇచ్చారు. శనివారం భోలక్పూర్ డివిజన్లోని దామోదరం సంజీవయ్యనగర్లో డివిజన్ ఉపాధ్యక్షుడు శంకర్గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నాలా ప్రాంతాన్ని పరిశీలించారు. అధికారులు తమకు నోటీసులు ఇచ్చారని, ఇండ్లు కూల్చేస్తామని చెపుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పందిస్తూ బాధితులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కృషి చేస్తానన్నారు. దామోదరం సంజీవయ్యనగర్లో దేవాలయం పక్కన ప్రత్యేక పిల్లర్లు వేసి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయిస్తామన్నారు. అనంతరం లోయర్ ట్యాంక్బండ్లో ముషీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఏర్పాటు కోసం స్థలాన్ని ఎమ్మెల్యే, పలువురు నాయకులు, సర్వేయర్ లక్ష్మితో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ భోలక్పూర్ అధ్యక్షుడు వై.శ్రీనివాస్ రావు, ఉపాధ్యక్షుడు ఆర్.శ్రీనివాస్, డివిజన్ బీసీ సెల్ అధ్యక్షుడు ఉమాకాంత్, దామోదర్ సంజీవయ్యనగర్ బస్తీ అధ్యక్షుడు నర్సింగ్ రావు, ప్రధాన కార్యదర్శి మహేశ్, ఉపాధ్యక్షుడు మల్లేశ్, కవాడిగూడ టీఆర్ఎస్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్ యాదవ్, నాయకులు ముఠా జయసింహ, మక్బూల్, సాయి పాల్గొన్నారు.
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత
చిక్కడపల్లి, డిసెంబర్25: ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. శనివారం కేశవ్ గురుస్వామి ఆధ్వర్యంలో రాంనగర్ డివిజన్లోని శ్రీరాంనగర్ బస్తీవద్ద అయ్యప్ప స్వామి 18వ మహాపడి పూజను నిర్వహించారు. బంగారు బాలుడు భజన మండలి గణేశ్ గురుస్వామి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నల్లకుంట కార్పొరేటర్ అమృత, టీఆర్ఎస్ గ్రేటర్ నాయకుడు ఎంఎన్ శ్రీనివాస్ రావు, యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, నాయకులు ఆర్.వివేక్, ఎం.కోటేశ్వర రావు, ఆర్.జయదేవ్, గురు స్వామి దుగిని శ్రీకాంత్, పాలమూరు అసోసియేషన్ నాయకుడు వి.వెంకట్ స్వామి పాల్గొన్నారు.