రూ.4.6 కోట్లతో జరుగుతున్న పనులు
డ్రైనేజీ సమస్యకు లభించనున్న శాశ్వత పరిష్కారం
హర్షం వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు
అల్లాపూర్,డిసెంబర్25: అల్లాపూర్ డివిజన్లో ఎన్నో ఏండ్ల నుంచి పరిష్కారానికి నోచుకోని అపరిష్కృత డ్రైనేజీ సమస్యకు త్వరలో మోక్షం లభించనున్నది. పెరిగిన జనాభాకు అనుగుణంగా పాత డ్రైనేజీ పైపులైన్ సామర్థ్యం సరిపోకపోవడంతో తరుచూ మ్యాన్హోల్స్ పొంగి మురుగు రోడ్లపై పారుతుండంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు స్థానిక కార్పొరేటర్ సబీహాబేగం ఎమ్మెల్యే కృష్ణారావు సహకారంతో రూ.4.6కోట్ల అంచనాతో డివిజన్లోని పలు ప్రాంతాల్లో అండర్డ్రైనేజీ పైపులైన్ పనులను ఇటీవలే ప్రారంభించారు.రాజీవ్గాంధీనగర్లో రూ.50 లక్షలు,సఫ్థార్నగర్లో రూ.50 లక్షలు,కేఎస్నగర్లో రూ.15లక్షల,పండిత్నెహ్రూనగర్ లోరూ.20 లక్షలు,గాయత్రీనగర్ రూ.20 లక్షలు,పద్మావతినగర్లోరూ.56లక్షలతో అంతర్గత డ్రైనేజీ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.ఇంకా జనప్రియానగర్ ,పర్వత్నగర్లో ఇప్పటికే పనులు పూర్తియ్యాయని అధికారులు తలిపారు.పనులను జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి కార్పొరేటర్ సబీహాబేగం పర్యవేక్షిస్తున్నారు.పనులను త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు.
సమస్యలను పరిష్కరించడం హర్షణీయం
ఎన్నో ఏండ్లుగా అపరిష్కృత డ్రైనేజీ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాం. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపు తూ పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తున్నారు.స్థానికంగా నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ఎమ్మెల్యే కృష్ణారావు,కార్పొరేటర్ సబీహాబేగం కృషి చేయడం హర్షణీయం.
-జహెద్ షరీఫ్బాబా,పర్వత్నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు
త్వరగా పనులను పూర్తి చేస్తాం..
పురాతనమైన డ్రైనేజీ లైన్ వల్ల తరుచూ సమస్య ఉత్పన్నమయ్యేది. ఈ నేపథ్యంలో రూ. 4.60కోట్లతో అల్లాపూర్ డివిజన్ పలు కాలనీల్లో కొత్త డ్రైనేజీ లైన్ పనులు చేపట్టాం. ఎప్పటికే పలు కాలనీల్లో పను లు పూర్తయ్యాయి. ఇంకా మరికొన్ని చోట్ల పనులు తుది దశకు చేరుకున్నాయి.త్వరగా పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. -రంజిత్ ,ఏఈ