కందుకూరు, డిసెంబర్ 20: అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటున్నదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం కందుకూరు మండల పరిధి ఆకులమైలారంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని కందుకూరుకు తిరిగి వస్తుండగా మార్గమధ్యలో మీర్ఖాన్పేట గ్రామానికి చెందిన గొర్రెల కాపరి వంగూరి నర్సింహ దంపతులను చూసి కాన్వాయ్ను ఆపి వారిని పలుకరించారు. మొత్తం ఎన్ని గొర్లు, మేకలు ఉన్నాయి? వీటిని ఎక్కడ కొన్నారని అడగ్గా.. ప్రభుత్వం ఇచ్చినవేనని వారు సమాధానం ఇచ్చారు. దీంతో స్పందించిన మంత్రి మాట్లాడుతూ సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని అన్నారు. మరోవైపు మంత్రి తమ వద్దకు వచ్చి పలుకరించడంతో ఆ వృద్ధ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి వెంట జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని వరలక్ష్మీసురేందర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, నాయకులు మన్నె జయేందర్, చిర్ర సాయిలు, ప్రశాంత్చారి, ఉమాకాంత్రెడ్డి, మోహన్రెడ్డి, ఎంటీసీ రాములు, నర్సింహ ఉన్నారు.