కొండాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని శేరిలింగంపల్లి మండలం చందానగర్ సర్వే నెంబర్ 65,66లోని 2.27 గుంటల ప్రభుత్వ భూమి బహిరంగ వేలానికి అధికారులు సిద్ధం చేస్తున్నారు.
గురువారం రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, రాజేంద్రనగర్ ఆర్డీఓ చంద్రకళ, టీఎస్ఐఐసీ జోనల్ కమిషనర్ అనురాధ, రాజీవ్ స్వగృహ ఈఈ నందకుమార్, శేరిలింగంపల్లి తహశీల్దార్ కార్యాలయ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ప్రభుత్వ భూమిని వెంటనే చదును చేసి బహిరంగ వేలానికి సిద్ధం చేయాల్సిందిగా రెవెన్యూ సిబ్బందిని అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు.
స్థల కొనుగోలు విషయంలో ఆసక్తి కలిగిన వారు వెంటనే టీఎస్ఐఐసీ కార్యాలయంలో సంప్రదిం చాల్సిందిగా తెలిపారు. బహిరంగ వేలానికి సంబంధించిన పూర్తి వివరాలను టీఎస్ఐఐసీ అధికారులు వివరిస్తారని పేర్కొన్నారు.