స్వామి వివేకానంద జయంతిలో విప్ అరెకపూడిగాంధీ
మియాపూర్, జనవరి 12 : వివేకానందుడి 157వ జయంతిని వివేకానందనగర్ డివిజన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి, దొడ్ల వెంకటేశ్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్లతో కలిసి బుధవారం విప్ అరెకపూడి గాంధీ వివేకానందుడి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. దేశ ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడని, యువత సన్మార్గంలో నడిచేలా దారి చూపారని పేర్కొన్నారు. శాంతి సహనంతో ఎలా ముందుకు నడవాలో, యువత దేశ పురోగతిలో ఎంత కీలకమో వివేకానందుడు విలువైన బోధనలను చేశాడన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, పార్టీ నేతలు, కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
హెచ్సీయూలో స్వామి వివేకానంద జయంతి
కొండాపూర్, జనవరి 12: జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి స్వామి వివేకానంద జయంతిని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హెచ్సీయూ ఏబీవీపీ అధ్యక్షుడు నమ్రతా సింగ్, హెచ్సీయూ ఏబీవీపీ కార్యదర్శి యుగంధర్ విచ్చేసి విద్యార్థులతో కలిసి స్వామి వివేకానంద చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువతే దేశ అభ్యున్నతికి దిశానిర్ధేశమని హెచ్సీయూ ఏబీవీపీ అధ్యక్షుడు నమ్రతా సింగ్ అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్సీయూ ఏబీవీపీ కార్యకర్తలు అర్జున్, వినిత్, లక్ష్మణ్, బ్రిజేష్ తదితరులు ఉన్నారు.