యాదగిరిగుట్ట రూరల్, డిసెంబర్ 7 : రైతులు యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ సూచించారు. మంగళవారం మండలంలోని మైలార్గూడెంలో ఇతర పంటల సాగుపై నిర్వహించిన అవగాహన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెసర, మినుములు, నువ్వులు తదితర పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. సాగు విషయంలో సందేహాలుంటే వ్యవసాయాధికారులను సంప్రదించాలన్నారు. అనంతరం పల్లె ప్రకృతి వనం, నర్సరీని పరిశీలించారు. కార్యక్రమంలో ఏడీఏ పద్మావతి, ఎంపీడీఓ కారం ప్రభాకర్రెడ్డి, ఏఓ రాజేశ్కుమార్, సర్పంచ్ కాదూరి రజిత, ఏఈఓ వెంకట్రావ్ పాల్గొన్నారు.
సేంద్రియ సాగును ప్రోత్సహించాలి
భువనగిరి : సేంద్రియ వ్యవసాయ రైతులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. మండలంలోని ముత్తిరెడ్డిగూడెం సమీపంలోని రైతు వేదికలో సేంద్రియ వ్యవసాయ ఆధారిత పంటలు పండించే రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. రైతులు తమ ఉత్పత్తులను సేంద్రియ వ్యవసాయ రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా మార్కెట్ యార్డులో అమ్ముకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీఏఓ అనూరాధ, అధికారులు పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం)/మోటకొండూరు : ఆత్మకూర్ మండలంలోని సర్వేపల్లిలో, మోటకొండూరు, మాటూరు, ఆరెగూడెం, కాటేపల్లిలో ఏఓలు శిల్ప, సుజాతలు రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం ఇతర పంటల వివరాలతో ముద్రించిన ప్రచార పోస్టర్లు, పుస్తకాలను రైతులకు అందజేశారు. సర్పంచ్ ఎల్లయ్య, ఏఈఓలు పాల్గొన్నారు.
గుండాల : మండలంలోని వెల్మజాలలో రైతులకు ఏడీఏ వెంకటేశ్వర్లు అవగాహన కల్పించారు. ఎంపీడీఓ శ్రీనివాసులు, ఏఓ సంతోషి, సర్పంచ్ సంగి బాలకృష్ణ, మాజీ ఎంపీపీ వేణుగోపాల్యాదవ్, బాలమల్లు పాల్గొన్నారు.
ఆలేరురూరల్ : మండలంలోని గొలనుకొండలో ఏఓ పద్మజ రైతులకు అవగాహన కల్పించారు.
చౌటుప్పల్ : మున్సిపాలిటీ పరిధిలోని తాళ్లసింగారం, లింగారెడ్డిగూడెం గ్రామాల్లో సింగిల్విండో చైర్మన్ చింతల దామోదర్రెడ్డి రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం ప్రభుత్వం రూపొందించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఏఓ ముత్యాల నాగరాజు, ఏఈఓ సీమ పాల్గొన్నారు.