వికారాబాద్, డిసెంబర్ 1: గ్రామాల్లో నెలకొన్న విద్యు త్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కోరారు. బుధవారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వి ద్యుత్ శాఖ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీతో నేను కార్యక్రమంలో భాగంగా పర్యటించిన వికారాబాద్, ధారూరు, మోమిన్పేట మండలాల్లోని గ్రామా ల్లో విద్యుత్ సమస్యల పరిష్కారం ఎంతవరకు వచ్చిందన్నారు. వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించాలన్నారు. గ్రామాల్లో కొత్త స్తంభాల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచెలు ఏర్పాటు చేయాలని, పంట పొలాల వద్ద వేలాడుతున్న విద్యుత్ తీగలను సరి చేయాలన్నా రు. గ్రామాల్లో వీధి దీపాల ఆన్/ఆఫ్ కోసం ప్రత్యేకంగా వ్యవస్థ ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. కొన్ని గ్రామాల్లో వీధి దీపాలు లేవని, వాటిని తొందరగా ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, ఎంపీపీ చంద్రకళ, మండల అధ్యక్షుడు కమాల్రెడ్డి, ఎంపీవో నాగరాజ్, సర్పంచ్లు పురుషోత్తం, ఆంజనేయులు, తిరుపతిరెడ్డి, మాధవరెడ్డి, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.