తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి దిక్సూచి అయిన ఆచార్య జయశంకర్ సార్ జీవితం భావితరాలకు ఆదర్శనీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమం మొదలు
పెట్టిన రోజున ప్రొఫెసర్ మార్గదర్శకం చేశారని గుర్తుచేసుకున్నారు. జయశంకర్సార్ జయంతి సందర్భంగా శుక్రవారం సూర్యాపేటలోని క్యాంప్ కార్యాలయంతోపాటు కలెక్టరేట్లో ఆచార్యుడి చిత్రపటానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అటువంటి మహనీయుల కలలు సీఎం కేసీఆర్ పాలనలో సాకారమవుతున్నాయన్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎమ్మెల్యేలు, అధికారులు జయశంకర్ జయంతి కార్యక్రమాలు నిర్వహించారు.
సూర్యాపేట టౌన్, ఆగస్టు 6 :ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ సార్ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మండలాలు, గ్రామాల్లో సార్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంతో పాటు కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన వేడుకల్లో మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొని నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి దిక్సూచి, జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్ సార్ అని.. తెలంగాణ ఏర్పాటు సమయంలో ఆయన లేకపోవడం అన్న బాధ వెంటాడుతున్నా ఆయన ఆలోచన విధానం మేరకే సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. అటువంటి మహనీయుల కలలు సీఎం కేసీఆర్ నాయకత్వంలో పోరాడి సాధించిన తెలంగాణలో గత ఏడేళ్లుగా సాకారమవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ మోహన్ రావు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, ఉప్పల ఆనంద్, ముదిరెడ్డి అనీల్ రెడ్డి, కీసర వేణుగోపాల్ రెడ్డిలతో పాటు వార్డు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
ఆలేరు మండలంలో..
ఆలేరు రూరల్: సార్ జయంతిని ఘనంగా నిర్వహించి ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళ్లులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఆరుట్ల లక్ష్మీప్రసాద్రెడ్డి, వంగాల శ్రీశై లం, వడ్ల నవ్యశోభన్బాబు, ఏసిరెడ్డి మహేందర్రెడ్డి, పులుగం పద్మాయాదిరెడ్డి తదితరులున్నారు.
తుర్కపల్లిలో..
తుర్కపల్లి: రుస్తాపురంలో జయశంకర్ విగ్రహానికి ఎంపీపీ సుశీలారవీందర్, జడ్పీవైస్చైర్మన్ భిక్కూ నాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పడాల శ్రీనివాస్, వాసాలమర్రిలో సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ పలుగుల నవీన్కుమార్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లులర్పించారు. రైతుబంధు సమితి మండల కన్వీనర్ కొమిరిశెట్టి నర్సింహులు, సర్పంచ్లు పడాల వనితాశ్రీనివాస్, వంకరి లావణ్య, జక్కుల శ్రీవాణి వెంకటేశ్, ఎస్సీసెల్ మండలాధ్యక్షుడు లచ్చయ్య, ఎంపీటీసీలు గిద్దెకరుణాకర్, వనజా, తలారి శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రీశైలం పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం)లో..
ఆత్మకూరు(ఎం): మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ తండమంగమ్మ, జడ్పీటీసీ కె.నరేందర్గుప్తా, తహసీల్దార్ జ్యోతి, ఎంపీడీవో రాములు, ఎంపీవో పద్మావతి, సర్పంచ్లు రమేశ్, నగేశ్, తిర్మల్రెడ్డి పాల్గొన్నారు.
రాజాపేటలో..
రాజాపేట: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ సారు జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాని కి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జడ్పీటీసీ గోపాల్గౌడ్, ఎంపీడీవో రామరాజు, ఎంపీవో దినకర్, ఏపీవో పరశురాములు, ఎంపీటీసీ నరేశ్రెడ్డి తదితరులున్నారు
బొమ్మలరామారంలో..
బొమ్మలరామారం: మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ చిమ్ముల సుధీర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గూదె బాలనర్సయ్య, ఎంపీడీవో సరిత, తహసీల్దార్ జయమ్మ, నాయకులు మచ్చ శ్రీనివాస్గౌడ్, గొడుగు చంద్రమౌళి, గణేశ్, జూపల్లి భరత్, పెద్దిరెడ్డి మల్లారెడ్డి పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట రూరల్లో..
యాదగిరి మండలం: మల్లాపురం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నాయకులు మల్లేశ్, సత్తయ్య, శేఖర్, ఉడత బాలరాజు, కర్రె శేఖర్, కరుణాకర్ పాల్గొన్నారు.
చౌటుప్పల్లో..
చౌట్పల్లి : మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లిలో సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు ముటుకుల్లోజు దయాకరాచారి జయశంకర్విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ బొడ్డు ముత్యం, నాయకులు కొయ్యడ శేఖర్గౌడ్, బొంగు స్వామిగౌడ్, రాగీరు సత్యనారాయణ, శేఖర్, ఊదరి యాదయ్య, రావుల లింగస్వామి పాల్గొన్నారు. ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో ఎస్ సూరజ్కుమార్, మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు ల ఆధ్వర్యంలో జయశంకర్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గిరిధర్, మున్సిపల్ కమిషనర్ కోమటిరెడ్డి నర్సింహరెడ్డి, టి రాజేశ్, టి మాధురి, ప్రియాంక పాల్గొన్నారు.
అడ్డగూడూరులో..
అడ్డగూడూరు : జయశంకర్ సార్ సేవలు మరువలేనివని ఎం పీపీ దర్శనాల అంజయ్య, జడ్పీటీసీ శ్రీరాముల జ్యోతి అయో ధ్య అన్నారు. మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం లో సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఆర్పించారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్రెడ్డి,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిప్పలపల్లి మహేంద్రనాథ్,సర్పంచ్ త్రివేణి, టీఆర్ఎస్ మండలప్రధానకార్యదర్శి చౌగోని సత్యంగౌడ్, శ్రీరాముల అయోధ్య, జక్కుల యాదగిరి,జనార్దన్రెడ్డి ,పరమేశ్, ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది పాల్గోన్నారు.
బీబీనగర్లో..
బీబీనగర్: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జయశంకర్ చిత్రపటం వద్ద ఎంపీపీ సుధాకర్, అధికారులు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీవాణి, వైస్ ఎంపీపీ వాకిటి గణేశ్రెడ్డి, ఎంపీఓ స్వాతి, ఎంపీటీసీలు గోరుకంటి బాల్చందర్, ముడావత్ వాణి వీరూనాయక్, జిట్టా రజిత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, సోము రమేశ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
మోటకొండూర్లో..
మోట కొండూర్: మండలంలోని ఎంపీడీవో, తహసీల్, వ్యవసాయ శాఖ కార్యాలయాలతో పాటు ప్రాథమిక ఉన్నత పాఠశాలతో పాటు ఆయా గ్రామాలలో ప్రజాప్రతినిధులు, అధికారులు జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ పైళ్ల ఇందిరాసత్యానారాయణరెడ్డి, ఏవో సుబ్బూరి సుజాత, ఎంపీడీవో వీరస్వామి., తహసీల్దార్ రాము, ప్రధానోపాధ్యాయులు రఘురాంరెడ్డి, ఎంపీటీసీ పన్నాల అంజిరెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు ఎండీ బురాన్ పాల్గొన్నారు.
వలిగొండలో..
వలిగొండ: వలిగొండలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీడీవో గీతారెడ్డి, సర్పంచ్ బోళ్ల లలితా శ్రీనివాస్, వాకిటి అనంతరెడ్డి, ఎంపీవో కేదారీశ్వర్, బీసీ సంఘం అధ్యక్షుడు సాయిని యాదగిరి, నానచర్ల రమేశ్, సర్పంచ్లు పాల్గొన్నారు.
రామన్నపేటలో..
రామన్నపేట: మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ అని ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం, ఎంపీడీవో జలేందర్రెడ్డిలు జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్ బెల్లి యాదయ్య, ఏపీవో వెంకన్న పీఆర్ఏఈ గాలయ్య, విక్రమ్, ఆర్వీ సత్యనారయణ తదితరులు పాల్గొన్నారు.
భూదాన్పోచంపల్లిలో..
భూదాన్పోచంపల్లి: మండల వ్యాప్తంగా సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు.
ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీడీవో ఏ బాలశంకర్, వైస్ ఎంపీపీ పాక వెంకటేశం యాదవ్, నాయకులు బత్తుల శ్రీశైలం గౌడ్, పీసర్ల మహిపాల్రెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ కాంప్లెక్స్లో నిర్వహించిన కార్యక్రమంలో బడుగు చండికేశ్వర్, భోగ విష్ణు, కర్నాటి నర్సింహ, గుండు వెంకటేశం, ఈపూరి ముత్యాలు, కేమ నర్సింహ తదితరులు పాల్గొన్నారు