గ్రామాల్లో స్థితిగతులపై అధ్యయనం
ములుగు, భూపాలపల్లి జిల్లాలకు 20 మంది ట్రెయినీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల రాక
చిట్యాల, మొగుళ్లపల్లి, గణపురానికి నలుగురి చొప్పున, తాడ్వాయికి 8మంది
వారం పాటు అక్కడే బసశాఖలవారీగా పరిశీలన
మొగుళ్లపల్లి/చిట్యాల/గణపురం/తాడ్వాయి, మార్చి 15: పల్లెల్లో స్థితిగతులను అధ్యయనం చేసేందుకు శిక్షణలో భా గంగా యువ అధికారులు సోమవారం జయశంకర్ భూపాల పల్లి, ములుగు జిల్లాలకు చేరుకున్నారు. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పథకాలు, కార్యక్ర మాల అమలు తీరును తెలుసుకునేందుకు 20మంది ట్రె యి నీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లు చిట్యాల, మొగుళ్లపల్లి, గణ పురం, తాడ్వాయికి రాగా, స్థానిక అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రజల జీవనవిధానం, మౌలిక వసతులు, ఆర్థిక స్థి తిగతులను తెలుసుకోవడంతోపాటు శాఖలవారీగా సమీక్షలు నిర్వహించేందుకు వారం పాటు ఇక్కడే బస చేయనున్నారు.
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పిడిసిల్ల గ్రా మానికి నలుగురు ట్రెయినీలు కౌశిక్ కిషోర్మీనా(ఐసీఏఎస్), నిఖిల్ఫాతక్(ఐపీఎస్) అశిష్సింగ్(ఐఎఫ్ఎస్), అమర్నాథ్ ఓజా(ఐపీటీఏఎఫ్ఎస్) చేరుకున్నారు. వీరికి తహసీ ల్దార్ సమ్మయ్య, ఎంపీడీవో రామయ్య, ఎంపీటీసీ దండ వెం కటేశ్వర్రెడ్డి, సర్పంచ్ నైనకంటి ప్రభాకర్రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో బస ఏర్పాటుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రా మాల అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలను పర్యవేక్షించనున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.
నవాబుపేటకు నలుగురు..
చిట్యాల మండలం నవాబుపేటకు నలుగురు అధికారులు వచ్చారు. మీట్ మక్వానా(ఐపీఎస్), మిలీశ్శర్మ(ఐఎఫ్ఎస్), అఖిల్థంపీ(ఐఎఫ్ఎస్), రౌనక్ అగర్వాల్(ఐసీఎల్ఎస్) గ్రా మ పరిపాలనపై అధ్యయనం చేయనున్న ట్లు తెలిపారు. వారి వెంట టీం కో ఆర్డినేటర్ రావు ల కిషన్, ఎంపీడీవో రవీంద్రనాథ్, ఎంపీవో శం కర్రావు, సర్పంచ్ కసిరెడ్డి సాయిసుధ ఉన్నారు.
బుద్దారానికి నలుగురు..
గణపురం మండలం బుద్దారం గ్రామానికి నలుగురు శిక్షణ అధికారులు అల్బర్ట్ జాన్ (ఐపీఎస్), సిద్ధార్థ్ కుమార్ మీనా (ఐడీఈఎస్), రాజేంద్ర చౌదరి (ఐసీఏఎస్), ఇచాక్ అభిజిత్ దిలీప్రావు(ఐపీఓఎస్) చేరుకున్నారు. పలు గ్రామీణ అభివృద్ధి అంశాల అవగాహన కోసం వారం పాటు గ్రామంలో బస చేయనున్నట్లు తహసీల్దార్ పాలకుర్తి మాధవి తెలిపారు. బుద్దా రం గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా తమ వంతు కృషిచేస్తామని ట్రెయినీ అధికారులు పేర్కొన్నారు. డీఆర్డీవో పురుషోత్తం, ఎంపీవో రామకృష్ణ, వైస్ ఎం పీపీ విడిదీనేని అశోక్, పంచాయతీ కార్యదర్శి నవీన్ పాల్గొన్నారు.
తాడ్వాయికి ఎనిమిది మంది..
ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి 8మంది(మేడారం-4, కామారం-4) ట్రెయినీలు చేరుకున్నారు. తహసీల్దార్ శ్రీనివాస్ వారికి వసతి ఏర్పాట్లు చేశారు. వృత్తిపరమైన శిక్షణలో భాగంగా వీరు వారం పాటు అధ్యయనం చేయనున్నారు.