మొగలాయిలను ఎదురించి ఎదిరించి గోల్కొండ కోటపై బడుగుల జెండా ఎగురవేసిన మహానుభావుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని, ఆయన ఆశయ సాధన లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం ఆలేరు పట్టణంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. యాదాద్రి దేవస్థానం పునర్నిర్మాణంతో జిల్లా పర్యాటక కేంద్రంగా మారుతున్నదన్నారు. భువనగిరి మండలం నందనంలో త్వరలో నీరా కేంద్రం ఏర్పాటు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయనున్నామని, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి కోరితే ఆలేరులో సైతం నీరా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఆలేరు, ఏప్రిల్ 30 : సర్వాయి పాపన్న ఆశయాలు సాధించాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని, గౌడ సొసైటీ ఫంక్షన్ హాల్ను శనివారం ఆయన ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆలేరు నియోజకవర్గ గౌడ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. గోల్కొండ కోటపై బడుగుల జెండా ఎగురవేసిన గొప్ప బహుజన వాది సర్వాయి పాపన్నగౌడ్ అని కొనియాడారు.
ఆయన అడుగు జాడల్లోనే సీఎం కేసీఆర్ ఆంధ్ర పాలనను అంతం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారన్నారు. భువనగిరి మండలంలోని నందనం గ్రామంలో రూ.8కోట్లతో కల్లు నీరా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని త్వరలో టెండర్ల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి కోరితే ఆలేరులో సైతం కల్లు నీరా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని కుల వృత్తులకు పెద్దపీట వేశారన్నారు. గీత కార్మికులకు తాళ్ల పన్ను రద్దు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు.
అనంతరం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి మాట్లాడుతూ మిత్రుడి పేరును తన ఇంటి పేరుగా మార్చుకున్న గొప్ప మానవతావాది సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని కొనియాడారు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వాల పాలనలో కల్లు దుకాణాలు నిర్వీర్యం చేసి గీత కార్మికులను ఆర్థికంగా ఎదగనివ్వకుండా కుట్రలు పన్నారని విమర్శించారు.
కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధాహేమేందర్గౌడ్, ఆలేరు పీఏసీఎస్ చైర్మన్ మెగులగాని మల్లేశ్గౌడ్, ఆలేరు మున్సిపల్ వైస్ చైర్మన్ మెరిగాడి మాధవీవెంకటేశ్గౌడ్, మార్కెట్ వైస్ చైర్మన్ నాగరాజు, మోటకొండూర్ వైస్ ఎంపీపీ ఇల్లెందుల మల్లేశ్గౌడ్, ఆలేరు గౌడ సంఘం నాయకుడు గనగాని శంకర్గౌడ్, పుట్ట మల్లేశ్గౌడ్, సూదగాని రామదాస్, సూదగాని హరీశ్శంకర్గౌడ్, బీస కృష్ణంరాజు, ఉదయ్కిరణ్, అయిలి కృష్ణ, కోరుకొప్పుల కిష్టయ్య, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.