గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానికి అనుబంధంగా, అన్నదాతకు అండగా ఉండే పాడి పరిశ్రమ వృద్ధిపై
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. పాడి రైతులకు ప్రోత్సాహకాలతో భరోసాను అందిస్తున్నది. తాజాగా నార్మాక్స్(మదర్ డెయిరీ) పరిధిలోని కుటుంబాలకు లీటరుకు 3 రూపాయల చొప్పున ఇన్సెంటివ్ను విడుదల చేసింది. దాదాపు 30 నెలలకు సంబంధించి రూ.20.20కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఆ సంతోషంలో పాడి రైతులు జిల్లావ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
భువనగిరి కలెక్టరేట్, ఎప్రిల్ 29 : రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం కల్పిస్తూ ముందుకు సాగుతున్నది. నార్మాక్స్(మదర్ డెయిరీ) రైతులకు జనవరి 2019 నుంచి జూన్ 2021 వరకు లీటరుకు 3 రూపాయల చొప్పున ఇన్సెంటివ్ బకాయిలు రూ.20.20 కోట్లను విడుదల చేసి రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాడి రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు చేశారు. ఇప్పటి వరకు ప్రోత్సాహక పథకం కింద రూ.39.26 కోట్లు, పాడి పశువుల పంపిణీ పథకం కింద రూ.63.72 కోట్లు కలుపుకుని మొత్తం రూ.102.98కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బకాయి సొమ్ము రూ.40 వేలు నా బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. సంతోషంగా ఉంది. పాడి రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– ఉగ్గి వెంకటేశ్, పాడిరైతు, రామచంద్రాపురం
పాడి రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పాడిరైతుల పక్షపాతిగా నిలిచారు. రూ.12 వేలు నా ఖాతాలో జమ అయ్యాయి. పాడి రైతులకు ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నది.
– కస్తూరి పాండు, పాడిరైతు, బస్వాపురం
పాడిరైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసింది. పాడి రైతులను ఆర్థికంగా బలోపేతం చేయాలనే సంకల్పంతో ముందడుగు వేస్తుంది. పాడి రైతుల కోసం ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.102.98 కోట్లను కేటాయించింది. పాడి రైతుల తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్కు, మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డికి కృతజ్ఞతలు.
– గంగుల కృష్ణారెడ్డి, (నార్మాక్స్)మదర్ డెయిరీ చైర్మన్
మోటకొండూర్, ఏప్రిల్ 29 : పాడి రైతులకు 30 నెలల ఇన్సెంటివ్ విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం మోటకొండూర్, మేడికుంటపల్లిలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. ఆయా కార్యక్రమాల్లో పాల సంఘం చైర్మన్లు కొల్లూరి మల్లేశ్మిత్ర, పైళ్ల పద్మారెడ్డి, ఎంపీటీసీ పన్నాల అంజిరెడ్డి, డైరెక్టర్లు అనంతుల జంగారెడ్డి, బొబ్బలి యాదిరెడ్డి, భూమండ్ల అయిలయ్య, టీఆర్ఎస్ మోటకొండూర్ అధ్యక్షుడు సుధీర్, పాల సంఘం డైరెక్టర్లు వెంకటేశ్, అంజయ్య, నాగిరెడ్డి, భూపాల్రెడ్డి, ప్రతాప్రెడ్డి, మల్లారెడ్డి, సబిత, పరశురాములు, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, నర్సింహులుయాదవ్, నర్సిరెడ్డి, నర్సింహ పాల్గొన్నారు.
భువనగిరి అర్బన్ : మండలంలోని కూనూరు, బండసోమారం గ్రామాల్లో సీఎం కేసీఆర్ ఫ్లెక్లీలకు పాడి రైతులు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమాల్లో మదర్ డెయిరీ చైర్మన్లు నల్లమాస రాజు, మల్లేశం, మాజీ సర్పంచ్ కాటిక జంగయ్య, కూనూరు సర్పంచ్ అంకర్ల మురళి, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పాశం మహేశ్, మండల యూత్ అధ్యక్షుడు నాగేంద్రబాబు, డైరెక్టర్లు బుషిగంపల శ్రీనివాస్, వెంకటేశ్, బాలలింగం, శేఖర్, రాములు, సత్యనారాయణ, భాస్కర్, శంకర్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
వలిగొండ : మండల కేంద్రంలో పాడి రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. మదర్ డెయిరీ డైరెక్టర్ గూడూరు శ్రీధర్రెడ్డి, పాల సహకార సంఘం అధ్యక్షుడు సురేందర్, కృష్ణారెడ్డి, నర్సిరెడ్డి, వెంకటేశం, నర్సింహ, బుచ్చయ్య, నర్సిరెడ్డి, వెంకట్రెడ్డి, ఆంజనేయులు, మదర్ డెయిరీ మేనేజర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
మోత్కూరు : మోత్కూరు పాల శీతలీకరణ కేంద్రంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో నార్మాక్స్ డైరెక్టర్ రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్ పాల్గొన్నారు.
చౌటుప్పల్ : పట్టణంలోని పాల శీతలీకరణ కేంద్రంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. పాల సొసైటీ చైర్మన్లు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట రూరల్ : మండలంలోని వంగపల్లిలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మదర్ డైయిరీ డైరెక్టర్లు కళ్లెపల్లి శ్రీశైలం, కందాడి అలివేలు, వంగపల్లి ఉప సర్పంచ్ స్వామి పాల్గొన్నారు.