ఏడాదిన్నర కాలంగా బడులకే పరిమితమైన బస్సులు
ప్రభుత్వ నిర్ణయంతో కదిలిన బస్సులు
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 29 : కరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలన్నీ మూతబడ్డాయి. ఫలితంగా పిల్లల రవాణాకు ఉపయోగించే బస్సులు ఏడాదిన్నర కాలంగా పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాల్లోనే ఉండిపోయాయి. రాష్ట్రంలో కరోనా కేసుల తగ్గుముఖం పట్టడంతో విద్యార్థుల భవిష్యత్పై దృష్టి సారించిన తెలంగాణ సర్కారు విద్యా సంస్థల పునఃప్రారంభానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అయితే ప్రభుత్వ నిర్ణయంతో విద్యా సంస్థల యాజమాన్యాలు బస్సులను సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి. ‘ఫిట్నెస్’ సర్టిఫికెట్ కోసం రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లేందుకు ముందుగా బస్సులను మెకానిక్ షెడ్డులకు పంపుతున్నాయి. అన్ని హంగులతో బస్సులు సిద్ధమవుతున్నాయి. ఆ తర్వాత ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం రవాణాశాఖ కార్యాలయం వైపు వెళ్లనున్నాయి. మరోవైపు ఫిట్నెస్ చేయించుకున్న తరువాతనే బస్సులను రోడ్డెక్కించాలని..సెప్టెంబర్ 31నాటికి బస్సులకు ఫిట్నెస్ చేయించుకోవాలని రవాణా శాఖ ఇప్పటికే జిల్లాలోని అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలకు అదేశాలు జారీ చేసింది.
ప్రైవేటు స్కూల్ బస్సులకు ఉండాల్సిన నిబంధనలు..
బస్సులకు తప్పనిసరిగా పసుపు రంగు వేసి ఉండాలి.
వైపులా పాఠశాలల పేరు, చిరునామా, ఫోన్ నంబర్లు రాసి ఉండాలి.
ఎయిడ్ బాక్సు, అవసరమైన మందులు అత్యవసర పరికరాలు అందుబాటులో ఉండాలి.
పైబడిన వారిని డ్రైవర్లుగా నియమించరాదు.
యాజమాన్యం డ్రైవర్ల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించాలి.
నడపడంలో ఐదేళ్లకు పైగా అనుభవం ఉన్న వారినే డ్రైవర్గానియమించుకోవాలి.
ఇంజిన్ కండీషన్తోపాటు పిల్లలు కూర్చునేందుకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.
అత్యావసర ద్వారాన్ని గుర్తించేలా పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంచాలి.
కిటికీలకు రక్షణ కవచాలు ఏర్పాటు చేయాలి
విద్యార్థులను డ్రైవర్ గమనించేలా మధ్యలో అద్దాన్ని ఏర్పాటు చేయాలి.ఫుట్ బోర్డుపై విద్యార్థులు నిల్చోకుండా జాగ్రత్తలు పాటించాలి.
వచ్చే బస్సులను గుర్తించేందుకు వీలుగా బస్సుకు ఇరువైపులా అద్దాలను ఏర్పాటు చేయాలి.
ముందు స్టిక్కర్లను ఏర్పాటు చేయాలి.ఫిట్నెస్ చేయించుకుంటేనే రొడ్డెక్కాలి..
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బస్సులకు ఫిట్నెస్ పత్రం ఉంటేనే రోడ్డెక్కించాలి. విద్యార్థుల రవాణా చేపట్టే విద్యార్థులు బస్సులకు తప్పక ఫిట్నెస్ చేయించుకోవాలి. అలా కాకుండా విద్యార్థులను రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అయితే ఫిట్నెస్ గడువు కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాల జారీ కాలేదు. కార్యాలయానికి వచ్చిన బస్సులను మాత్రం అన్ని రకాలుగా పరిశీలించి ఫిట్నెస్ పత్రం జారీ చేస్తున్నాం.