
భువనగిరి అర్బన్, ఆగస్టు 17: జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ ఏరియా దవాఖాన మార్చురీ ఆవరణలోని ఖాళీ స్థలంలో ఇతర మొక్కలతోపాటు గంజాయి మొక్కలు పెరుగుతున్నట్లు గుర్తించామని భువనగిరి ఎక్సైజ్ సీఐ నాగిరెడ్డి తెలిపారు. మంగళవారం ఎక్సైజ్శాఖ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. పట్టణంలోని ఏరియా దవాఖానకు సోమవారం సాయంత్రం వైద్యం కోసం వచ్చిన వ్యక్తులు మార్చురీ సమీపంలోని మొక్క ల్లో గంజాయి మొక్కలు ఉన్నట్లు గుర్తించి దవాఖాన అధికారులకు తెలిపారన్నారు. వెంటనే దవాఖాన అధికారు లు అందించిన సమాచారంతో అక్కడికెళ్లి మొక్కలను పరిశీలించగా అప్పటికే నాలుగు మొక్కలు తీసి(పీకి) బయట చెత్తకుప్పలో పడేసినట్లు ఉన్నాయన్నారు. ఇవి రెండు నెలల మొక్కలని, ఎవరూ నాటినవి కావని, దవాఖానకు వచ్చే వారు గంజాయిని పీల్చి ప్యాకెట్లను పారవేయగా అందులోని గింజలు వర్షానికి మొలకెత్తి ఉంటాయన్నారు. అవి ఇంకా చిన్న మొక్కలని, వాటికి గింజలు రాలేదని, సాధారణంగా గంజాయి మొక్కలు ఏడు నుం చి ఎనిమిది నెలల్లో పక్వానికి (గింజలు) వస్తాయని చెప్పారు. దవాఖాన పరిసరాలను పరిశీలించినా ఎలాం టి గంజాయి మొక్కలు కనిపించలేదని, చెత్తకుప్పలో పడేసిన నాలుగు మొక్కలే దొరికాయని, వాటికి పంచనామా నిర్వహించి కాల్చి వేస్తామన్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా దవాఖానకు వచ్చే వారిపై నిఘా ఉంచాలని చెప్పారని, ఎక్కడైనా గంజాయి మొక్కలు ఉన్నట్లు అనుమానం ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని ఆయన తెలిపారు.
దవాఖాన ఆవరణలో గంజాయి మొక్కలు ఉన్నట్లు చికి త్స నిమిత్తం వచ్చిన వ్యక్తులు చెప్పడంతో వెంటనే ఎక్సైజ్శాఖ అధికారులకు సమాచారం అందజేసినట్లు దవాఖాన సూపరింటెండెంట్ రవిప్రకాశ్ చెప్పారు. ఎక్సైజ్శాఖ అధికారులతోపాటు గంజాయి మొక్కలు ఉన్న ప్ర దేశాన్ని పరిశీలించగా అప్పటికే నాలుగు గంజాయి మొ క్కలు తీసి (పీకి) పక్కన ఉన్న చెత్తకుప్పలో పడేసినట్లు ఉన్నాయన్నారు. దవాఖాన ఆవరణలోకి గంజాయి మొ క్కలు ఎలా వచ్చాయో విచారణ జరుపుతామన్నారు. ఈ విషయంపై దవాఖాన శానిటైజేషన్, సెక్యూరిటీ సిబ్బందికి మెమోలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.