
అడ్డగూడూరు, ఆగస్టు 16 : హుజూరాబాద్లో సీఎం కేసీఆర్ దళితబంధు ప్రారంభిస్తుండటంతో మండలకేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్రెడ్డి,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిప్పలపల్లి మహేంద్రనాథ్ మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యుడు గుండిగ జోసఫ్, సర్పంచ్లు ఇటికాల కుమార్స్వామి, మద్ది సత్తయ్య, నాయకులు పాశం విష్ణువర్ధన్, మందుల కిరణ్, బైరు లింగయ్య, చిత్తలూరి నరేశ్, దావిద్, జనార్దన్రెడ్డి , గూడెపు పరమేశ్, జగన్ పాల్గొన్నారు.
మోత్కూరు, ఆగస్టు16: మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ మండల కమిటీ, ఎస్సీ సెల్ విభాగం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పొన్నేబోయిన రమేశ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు తీపిరెడ్డి మేఘారెడ్డి, చిప్పలపల్లి మహేందర్నాథ్, మాజీ వైస్ చైర్మన్ కొణతం యాకుబ్రెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు బుషిపాక లక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ బొల్లేపల్లి వెంకటయ్య, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు కొండ సోంమల్లు, మండల ప్రధాన కార్యదర్శి గజ్జి మల్లేశ్, మున్సిపల్ పట్టణ అధ్యక్షుడు బొడ్డుపల్లి కల్యాణ్ చక్రవర్తి, కౌన్సిలర్లు పురుగుల వెంకన్న, ఎస్సీసెల్ నాయకులు రఘుపతి, మర్రి అనిల్, దాసరి తిరుమల్లేశ్, మెంట నగేశ్ తదితరులు పాల్గొన్నారు.