మియాపూర్ : హైదర్నగర్ డివిజన్ పరిధిలోని ఆదిత్యనగర్లో ఫ్రెష్కో స్మార్ట్ ఫుడ్ కేంద్రాన్ని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, హరేకృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్ అధ్యక్షులు సత్య గౌర చంద్ర దాస ప్రభూజీతో కలిసి విప్ ఆరెకపూడి గాంధీ గురువారం సాయంత్రం ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహకులు మాట్లాడుతూ ఫ్రెష్ కో అనేది హరేకృష్ణ నుంచి వచ్చిన సామాజిక ఉద్యమమని ఇందులో శుద్ద శాఖాహార సాత్విక ఆహారం లభిస్తుందని పేర్కొన్నారు. సాత్విక ఆహారాన్ని ప్రోత్సహించటం ద్వారా రైతులకు మద్దతుగా నిలవటం, పర్యావరణానికి పాటుపడటం తమ ఫుడ్ కేంద్రం లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో హరేకృష్ణ ప్రతినిధులు పాల్గొన్నారు.