ముషీరాబాద్ : బడుగు, బలహీన వర్గాలకు టీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధిక కార్యకర్తలు, సభ్యత్వం కలిగి ఉన్న టీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర అభివృద్దే ధేయ్యంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో ముందుకుసాగుతుందన్నారు.
గురువారం అడిక్మెట్ డివిజన్ దయానంద్నగర్లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుతో తెలంగాణలో రాజకీయ చైతన్యం కలిగిందని, హక్కులు, స్వపరిపాలన కోసం పోరు ప్రజలంతా ఒక్కటై పోరు సాగించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారని అన్నారు.
ముషీరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ పట్టిష్టంగా ఉందని, తమ పార్టీని ఎదుర్కొనే సత్తా మరే రాజకీయ పార్టీకి లేదన్నారు.
ఈ కార్యక్రమంలో అడిక్మెట్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బి.శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.సురేందర్, నాయకులు ప్రేమ్కుమార్, శ్యామ్సుందర్, మహ్మద్ ఖదీర్, గురుదీప్సింగ్, అబ్బు, ప్రేమలతారెడ్డి, అనురాధ, అబ్బు, ప్రసన్న, మాధవ్, శ్రీకాంత్ దేవి, ఖలీల్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.