చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్
బాల వికాస సేంద్రియ ఉత్పత్తుల మేళా ప్రారంభం
సుబేదారి, మార్చి 28 : సుస్థిర సేంద్రియ వ్యవసాయంతో అనేక లాభాలు ఉంటాయని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో హన్మకొండ సుబేదారి ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సుస్థిర సేంద్రియ ఉత్పత్తుల మేళాను ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సేంద్రియ పంట ఉత్పత్తుల స్టాల్స్ను పరిశీలించారు. అనంతరం వినయ్భాస్కర్ మాట్లాడుతూ బాలవికాస సంస్థ పేదల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. సుస్థిర సేంద్రియ పద్ధతిలో సాగుచేసిన పంట ఉత్పత్తులపై గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించి, వారికి లాభాలు వచ్చేలా చేయడం అభినందనీయమన్నారు. సేంద్రియ పంట ఉత్పత్తులకు మంచి ఆదరణ, గిరాకీ ఉంటుందన్నారు. వరంగల్ నగరంలో సేంద్రియ ఉత్పత్తుల కొనుగోలు కోసం శాశ్వత కేంద్రాలను ఏర్పాటు చేయడానికి కృషిచేస్తానని చీఫ్విప్ హామీ ఇచ్చారు. అనంతరం హన్మకొండ ఏసీపీ జితేందర్రెడ్డి మాట్లాడుతూ సేంద్రియ ఉత్పత్తులు నగర ప్రజలకు అందుబాటులో ఉండేలా బాలవికాస సంస్థ మేళా ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. బాలవికాస డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి మాట్లాడుతూ 49 గ్రామాల్లో 1500 మంది రైతులతో సేంద్రియ ఉత్పత్తులు సాగుచేయిస్తున్నామని చెప్పారు. ఈ ఉత్పత్తులను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అనే దానిపై మేళా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయ ప్రోగ్రాం ఆఫీసర్ తిరుపతి, రైతులు పాల్గొన్నారు.
చీఫ్విప్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉద్యోగ సంఘాల నాయకులు
హన్మకొండ : నూతనంగా ఎన్నికైన వరంగల్ అర్బన్ జిల్లా టీఎన్జీవోస్ కార్యవర్గంతో పాటు పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు ఆదివారం సాయంత్రం హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి, స్వీట్లు పంపిణీ చేశారు. పీఆర్సీ పెంపుతో పాటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించిన సీఎం కేసీఆర్కు, సహకరించిన చీఫ్విప్కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని వినయ్భాస్కర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఎన్జీవో వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, టీజీవో ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అన్నమనేని జగన్మోహన్రావు, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి సోమ య్య, సహాయ అధ్యక్షుడు పుల్లూరి వేణుగోపాల్, ట్రెజరర్ రాజేశ్, మాజీ అధ్యక్షుడు కోలా రాజేశ్కుమార్గౌడ్, రాష్ట్ర నాయకులు కత్తి రమేశ్, రామునాయక్, టీజీవో నాయకులు డాకర్ ప్రవీణ్కుమార్, ఈగ వెంకన్న, మౌజొద్దీన్, లక్ష్మణ్రావు తదితరులు పాల్గొన్నారు.